వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పఠాన్‌కోట్: నిజం గుర్తించకుండా పోలీస్‌లు చితక్కొట్టారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

పఠాన్‌కోట్: పఠాన్‌కోట్‌లో ఉగ్ర దాడి సంచలనం రేపింది. ఈ విషయమై ఓ షాకింగ్ విషయం గోపాల్ అనే బాధితుడు చెబుతున్నాడు. గురుదాస్‌పూర్‌ మాజీ ఎస్పీతో పాటూ తనను కూడా కొందరు వ్యక్తులు అపహరించి హింసించారంటూ గోపాల్‌ అనే బాధితుడు పోలీసుల ఎదుట వెళ్లబోసుకున్న గోడు అరణ్యరోదనే అయిందట.

గురువారం గురుదాస్‌పూర్‌ మాజీ ఎస్పీ సల్వీందర్ సింగ్‌ వంట సహాయకుడైన గోపాల్‌ను సైనిక దుస్తుల్లో ఉన్న తీవ్రవాదులు విడిచి పెట్టగానే పరుగున పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు తాను చెప్పిన కీలక సమాచారాన్ని వినలేదని, పైగా తనను బాగా కొట్టారని వాపోయాడు.

ఆ రోజు పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు తనను చిత్రహింసలు పెట్టిన వైనాన్ని అతను ఓ దిన పత్రికతో పంచుకున్నాడు. తనను తీవ్రవాదులు విడిచిపెట్టగానే చీకట్లో ఎలాగో దారి వెతుక్కుంటూ ఒళ్లంతా గాయాలతో దాదాపు రెండు గంటలు నడిచి ఓ గ్రామానికి చేరానని, అక్కడి పోలీసు స్టేషన్‌లో నేను విషయం చెప్పానన్నాడు.

Pathankot terror witness' leads ignored, tortured instead

తాను చెప్పిన మాటలు ఎవరూ నమ్మలేదని, స్థానిక పోలీసులు, కొందరు ఇంటెలిజెన్స్‌ అధికారులు తనకు నరకం చూపించారన్నాడు.

మరోవైపు పఠాన్‌కోట్‌లో దాడులు మొదలైన తర్వాత కూడా తనకు హింస తప్పలేదని, తన ఆక్రందనను ఎవరూ పట్టించుకోలేదని గోపాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కీలకమైన సమాచారం వెంటనే అందించినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. ఆ రోజు తమ ముగ్గురినీ అపహరించి, శారీరకంగా హింసిన తీవ్రవాదుల స్వరాలను బట్టి చూస్తే వారు యువకుల్లా అనిపించారన్నాడు.

English summary
The uneventful drive back from a religious shrine on Friday evening didn’t take much time to turn into a nightmare for Madan Gopal, one of the three abducted by the terrorists who stormed the Pathankot air base on Saturday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X