నెహ్రూ, ఇందిరల తర్వాత.. మోడీ మూడో ప్రధాని: రామచంద్ర గుహ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అత్యంత విజయవంతమైన మూడో ప్రధాని కాబోతున్నారని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహా చెప్పారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత మోడీనే విజయవంతమైన ప్రధాని అన్నారు.
మోదీ చరిష్మా, ఆకర్షణీయత, మతం, భాష అనే హద్దులను కూడా చెరిపేస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ఇండియా సమావేశం 2017 కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్ర గుహా తన ప్రసంగంలో మోడీని ప్రశంసించారు.

మోడీ తన నిర్ణయాలు తీసుకునే అధికారం, ముందుచూపు వల్లే ఆ స్థాయికి వెళ్లారన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత ఆ స్థాయిలో అధికారం, చరిష్మా, కుల మత భాషా బేధాలు లేకుండా ప్రజలను ఆకర్షించిన భారత ప్రధాని ఎవ్వరూ లేరన్నారు.
భారత రాజకీయ చరిత్రలో కుల వ్యవస్థ, మహిళలపై వివక్ష అనేవి తిరస్కరించలేని రెండు కీలక అంశాలని రామచంద్ర గుహ తెలిపారు. హిందూ, ముస్లిం రెండు మతాల్లోనూ మహిళలపై వివక్ష కొనసాగిందన్నారు. హిందువుల కుల వ్యవస్థ అత్యంత కఠినమైనదన్నారు.
-
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!!












Click it and Unblock the Notifications