సీఎం ఆఫీస్లో ఊమెన్ చాందీ లైంగికంగా వేధించారు: సరిత ఫిర్యాదుపై కేసు నమోదు
తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఓ ఎమ్మెల్యేపై కేరళ పోలీసులు లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు. 2003 కేరళ సోలార్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.
ఇష్టపడి ఒకరితో శృంగారం, రెండో వ్యక్తి రేప్ ప్రయత్నం: నగ్నంగా మూడో అంతస్తు నుంచి దూకిన యువతి
2012లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఊమెన్ చాంది తన అధికారిక నివాసంలో తనపై లైంగిక దాడి చేశారని, ఓ మంత్రి నివాసంలో వేణుగోపాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సరిత ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేశారు. కేసు దర్యాఫ్తు కోసం ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
గతంలోనే ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో చాందీ, ఇతరులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఎం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పుడు అది ముందుకు సాగలేదు. చాందీ అప్పుడు హైకోర్టుకు వెళ్లడంతో దానిని కొట్టి వేసింది.
ఇటీవల సరితా నాయర్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు మరోసారి ఫిర్యాదుపై విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో చాందీ సహా ఏడుగురుపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సరితా ఇటీవల మరోసారి ఫిర్యాదు చేసింది. కాగా, ఇది రాజకీయ కుట్ర అని, చట్టపరంగా దీనిని ఎదుర్కొంటామని చాందీ చెప్పారు.