సీఎం ఆఫీస్లో ఊమెన్ చాందీ లైంగికంగా వేధించారు: సరిత ఫిర్యాదుపై కేసు నమోదు
తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఓ ఎమ్మెల్యేపై కేరళ పోలీసులు లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు. 2003 కేరళ సోలార్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.
2012లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఊమెన్ చాంది తన అధికారిక నివాసంలో తనపై లైంగిక దాడి చేశారని, ఓ మంత్రి నివాసంలో వేణుగోపాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సరిత ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేశారు. కేసు దర్యాఫ్తు కోసం ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

గతంలోనే ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో చాందీ, ఇతరులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఎం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పుడు అది ముందుకు సాగలేదు. చాందీ అప్పుడు హైకోర్టుకు వెళ్లడంతో దానిని కొట్టి వేసింది.
ఇటీవల సరితా నాయర్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు మరోసారి ఫిర్యాదుపై విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో చాందీ సహా ఏడుగురుపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సరితా ఇటీవల మరోసారి ఫిర్యాదు చేసింది. కాగా, ఇది రాజకీయ కుట్ర అని, చట్టపరంగా దీనిని ఎదుర్కొంటామని చాందీ చెప్పారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications