గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రామ్నాథ్ కోవింద్
ఎన్డీయే ప్రభుత్వ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో బీహార్ గవర్నర్ పదవికి రామ్నాథ్ కోవింద్ మంగళవారం రాజీనామా చేశారు.ఈ మేరకు ఆయన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు.
పాట్నా: ఎన్డీయే ప్రభుత్వ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో బీహార్ గవర్నర్ పదవికి రామ్నాథ్ కోవింద్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు.
కాగా, కోవింద్ స్థానంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు బెంగాల్ గవర్నర్ త్రిపాఠి బీహార్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది.

రాష్ట్రపతి ఎన్నికలపై గత కొంతకాలంగా ఏర్పడిన సిందిగ్ధతకు తెర దించుతూ.. రామ్నాథ్ కోవింద్ను తమ అభ్యర్థిగా ఎన్డీయే సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 23న కోవింద్ తన నామినేషన్ వేయనున్నారు.
కోవింద్ అభ్యర్థిత్వానికి ప్రతిపక్షాలు మద్దతు తెలిపితే.. ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. లేదంటే జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. జులై 20న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికైతే ప్రతిపక్షాలు తాము మరో అభ్యర్థిని బరిలో దించుతామని ప్రకటించాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications