శుభవార్త: ప్లాస్టిక్ తో పది రూపాయాల నోటు తయారీకి కేంద్రం అనుమతి
ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలా పది రూపాయాల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి వాటిని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వ్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలా పది రూపాయాల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి వాటిని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వ్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక సహయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్ సభలో ప్రకటించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు గాను ఆయన లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్లతో క్టేత్రస్థాయిలో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్టుగా మంత్రి ఆ సమాధానంలో తెలిపారు. ప్లాస్టిక్ మిశ్రమాల సేకరణ వాటిపై పది రూపాయాల ముద్రణ లాంటి విషయంలో అన్ని అనుమతులను కేంద్రం రిజర్వ్ బ్యాంకుకు ఇచ్చిందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లను ఎక్కువ కాలం దెబ్బతినకుండా ఉండే అవకాశం ఉందని మంత్రి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంకులు ప్రస్తుతమున్న నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ , ఇతర పదార్థాలతో చేసిన నోట్ల గురించి ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు.కరెన్సీ నోట్ల జీవితాన్ని పెంచే లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామని మంత్రి చెప్పారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications