కాశ్మీర్లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్, వారి వద్ద 2 చైనా పిస్టళ్లు
జమ్ము కాశ్మీర్లోని బారాముల్లాలో ముగ్గురు అనుమానితులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు సహాయకులుగా పని చేస్తున్నారు.
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని బారాముల్లాలో ముగ్గురు అనుమానితులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు సహాయకులుగా పని చేస్తున్నారు.
వీరు సహాయకులుగా పని చేస్తూనే యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించేందుకు పని చేస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

వీరి నుంచి రెండు చైనీస్ పిస్టళ్లు, ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్ము కాశ్మీర్ పోలీసులు, 29 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ దళాల జాయింట్ ఆపరేషన్లో ఈ ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications