డ్రగ్స్ ఇచ్చి విద్యార్థినులపై హాస్టల్ అధికారుల లైంగిక వేధింపులు
విద్యార్థినులకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు హాస్టల్ అధికారులు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ దాష్టీకాలపై ఓ బాలిక సాహసించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.
న్యూఢిల్లీ: విద్యార్థినులకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు హాస్టల్ అధికారులు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ దాష్టీకాలపై ఓ బాలిక సాహసించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.
హాస్టల్ లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న బాలికలను కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ అధికారులే కామపిశాచాలుగా మారారు. బాలికలకు బలవంతంగా డ్రగ్స్ ఇంజెక్షన్లు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తమ మాట వినని వాళ్ళను తీవ్రంగా కొట్టేవారని బాలిక ఫిర్యాదు చేసింది.

ఈ దాష్టీకాలపై ఓ బాలిక సాహసించి ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బాలికల వసతి గృహంలో ఈ దారుణం చోటు చేసుకొంది. హస్టల్లోని ఓ స్టాఫ్ మెంబర్ ఘాతుకాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే తనను రోజుల తరబడి పస్తులుంచారని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదుతో ధైర్యం తెచ్చుకొన్న మరో 9 మంది బాలికలు కూడ తమపై జరుగుతున్న అకృత్యాలను ఏకరువు పెట్టారు. ఈ మేరకు ఢిల్లీ మహిళా కమిషన్ కు లేఖ రాశారు. ఈ మేరకు డిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ బాధితుల నుండి వివరాలు సేకరించారు.అనంతరం బాలికలపై అకృత్యాలకు పాల్పడిన హాస్టల్ సిబ్బందిపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ విషయమై తాను రెండోసారి హాస్టల్ ను సందర్శించినప్పుడు బాలికలను కలుసుకోకుండా గదికి తాళం వేసి అడ్డుకొన్నారని ఆమె ఆరోపించారు. బాలికలకు ఆక్సిటోసిన్ తరహా డ్రగ్స్ ఇచ్చేవారని వెల్లడైందని అదికారులు చెబుతున్నారు. మమిళలపై అత్యాచారాలు జరిపేందుకు వారిని వేశ్యగృహాలకు అమ్మేందుకు నిషేధిత ఆక్సిటోసిన్ ఇస్తుంటారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications