బీజేపీతో పొత్తే కొంపముంచింది.. అంతా నాశనం : ఉద్దవ్ థాక్రే
ముంబై : బీజేపీతో పొత్తు వల్లే నిండా మునిగాం అంటున్నారు శివసేన అధ్యక్షుడు ఉద్దవే థాక్రే. 25 ఏళ్ల నుంచి బీజేపీతో కొనసాగిన మిత్రుత్వం వల్లే పార్టీ ఢీ లా పడిపోయిందని.. పొత్తుల వ్యవహారం లేకుండా సోలో గానే ముందుకెళ్లుంటే ఈపాటికి అధికారంలోకి వచ్చేవారమని వ్యాఖ్యానించారు ఉద్దవే థాక్రే.

శివసేన పార్టీ అధికార పత్రికలైన సామ్నా మరాఠీ, దోపహర్ కా సామ్నా హిందీ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఉద్దవ్ థాక్రే. మంగళవారం నాడు 56వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పార్టీ అధికార పత్రికలకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు ఉద్దవ్ థాక్రే. ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తును శివసేన తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. 'దాదాపు రెండు తరాలు.. 25 ఏళ్ల పాటు బీజేపీతో పొత్తును కొనసాగించడం వల్ల పార్టీ నాశనమైంది. సొంతబలాన్నే నమ్ముకుని ఉంటే ఎప్పుడో అధికారం సాధించేవాళ్లం' అని పేర్కొన్నారు థాక్రే. అయితే భావజాల ఐక్యతలో భాగంగానే జాతీయవాద దృక్పథంతో బీజేపీ పొత్తుకు బాల్ థాక్రే స్నేహ హస్తం చాచారని అన్నారు ఉద్దవ్ థాక్రే. ఇందులో ఎలాంటి ప్రేరేపణలకు తావు లేదని, బాల్ థాక్రే ఎప్పుడూ అధికారం కోసం పాకులాడ లేదన్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications