అందుబాటులో లేని కొందరు నేతలు.. ఆప్ ఆందోళన, బీజేపీ బేరసారాల నేఫథ్యంలో..
ఆప్ కొందరు ఎమ్మెల్యేలు సమావేశానికి రాకపోవడంతో ఆ పార్టీలో కలకలం రేపుతోంది. కొందరికీ బీజేపీ బేరసారాలు చేస్తుందని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే సమావేశం నిర్వహించగా.. కొందరు డుమ్మా కొట్టారు. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
బీజేపీలో చేరితే ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నేతలు తమకు ఆఫర్ ఇచ్చారని నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు చెప్పిన సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అందుబాటులో లేరు. ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ ఓ తీర్మానం ఆమోదించింది.
కోట్లాది రూపాయలు ఆశ చూపించి, తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఢిల్లీలో మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మరో 14 మందిపై కేసు నమోదు చేసింది. దీని లింకులు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించాయి. బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై తప్పుడు ఫ్ఐఆర్ నమోదు చేశారు. సీబీఐ రైడ్కు ఆదేశించడంపై కమిటీ అసంతృప్తితో ఉందని ఆప్ పీఏసీ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్సింగ్ తెలిపారు. సిసోడియాపై పీఏసీ విశ్వాసం ఉందని పేర్కొంది. సీబీఐ సిసోడియాకు వ్యతిరేకంగా ఏమీ కనుగొనలేదని సింగ్ పేర్కొన్నాడు.