కెన్యాలో ఉగ్రవాదులది నీచమైన పని: నరేంద్ర మోడి
బెంగళూరు: కెన్యాలోని గరిస్సా విశ్వవిద్యాలయం వసతి గృహంలోని విద్యార్థులను లక్షంగా చేసుకున్న ఉగ్రవాదులు దాడులు చెయ్యడం అత్యంత నీచమైన పని అని భారత ప్రధాని నరేంద్ర మోడి అభిప్రాయం వ్యక్తం చేశారు. అల్ -షబాబ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన ఈ దాడిలో 147 మంది విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
1998లో అమెరికా రాయభారి కార్యాలయం మీద దాడి జరిగిందని, దాని తరువాత అంతటి దుర్ఘటన ఇప్పుడు జరిగిందని అన్నారు. పాకిస్థాన్ లోని పేషావర్ లో స్కూల్ లో తాలిబన్ ఉగ్రవాదులు 150 మంది విద్యార్థులను పోట్టన పెట్టుకున్నారని, ఇప్పుడు అదే స్థాయిలో కాలేజ్ విద్యార్థులను అంతం చెయ్యడం చాల బాదకలిగించిందని అన్నారు. ఇదే విషయాలను ఆయన ట్విట్టర్ లో ట్విట్ చేశారు.
మా తప్పులు కాదు: అమిత్ షా
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టం పై కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తూవారిని తిప్పి కొట్టడానికి బీజేపీ నాయకులు సిద్దం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తున్నదని పదే పేద చెబుతున్న కాంగ్రెస్ నాయకులు మొదట మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడో వెతికే పనిలో ఉంటే మంచిదని సలహ ఇచ్చారు.
భూ సేకరణ చట్టం మంచిదే అని ప్రజలకు చెప్పడానికి మే నెల నుండి దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించాలని అమిత్ షా బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.