ఐఏఎస్ డికే. రవి: రీ పోస్టుమార్టుం చెయ్యాలని?
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డికే రవి మృతదేహానికి రీ పోస్టుమార్టుం చెయ్యాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. డికే. రవి మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసే విషయంపై సీబీఐ అధికారులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.
మార్చి 16వ తేదీన డికే రవి అనుమానాస్పదస్థితిలో మరణించారు. మరుసటి రోజు రవి మృతదేహానికి విక్టోరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అదే విధంగా రవి శరీరంలోని కొన్ని భాగాలలో స్యాంపిల్స్ సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. అయితే పోస్టుమార్టం విషయంలో సీబీఐ అధికారులకు పలు అనుమానాలు వచ్చాయి.
సమాధిలో నుండి రవి మృతదేహాన్ని బయటకు తీసి మళ్లీ పోస్టుమార్టం చెయ్యాలని సీబీఐ అధికారులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. రవి కేసు విషయంలో పలువురు ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఈ విషయంపై సీబీఐ అధికారులు జాగ్రతగా వ్యవహరిస్తున్నారు.
దర్యాప్తు చేస్తున్న విషయం బయటకు రాకుండ ఉండాలంటే కట్టుదిట్టమైన భద్రత ఉన్న కార్యాలయం అవసరం అని సీబీఐ అధికారులు అంటున్నారు. చెన్నయ్ సీబీఐ అధికారులకు గంగానగరంలోని బెంగళూరు సీబీఐ కార్యాలయం, సీఓడి కార్యాలయంలో ఒక కార్యాలయం ఎర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది.

అయితే చెన్నయ్ సీబీఐ అధికారులు అందుకు అంగీకరించడం లేదు. ఎంజీ రోడ్డులోని యుటిలిటి బిల్గింగ్ 13వ అంతస్తులో కార్యాలయం ఎర్పాటు చేసుకొవాలని సీబీఐ అధికారులు బావిస్తున్నారు. శుక్రవారం సీబీఐ అధికారి కృష్ణమూర్తి నేతృత్వంలోని బృందం విదాన సౌధకు వెళ్లి హోం శాఖ అధికారులు గగన్ దీప్, వీణా నాగరాజ్ తో చర్చించారు.
రవి మామను విచారించారు, సీసీ కెమెరాలు స్వాధీనం
శుక్రవారం రాత్రి సీబీఐ అధికారులు నాగరబావిలోని రవి మామ హనుమంతరాయప్ప ఇంటికి వెళ్లారు. 20 నిమిషాల పాటు ఆయనను విచారించి వివరాలు సేకరించారు. ఆయన ఇంటిలో ఉన్న సీసీకెమెరాలు, డీవీఆర్ స్వాధీనం చేసున్నారు. ఆ సమయంలో రవి భార్య కుసుమా ఇంటిలోనే ఉన్నారు.
అయితే సీబీఐ అధికారులు కుసుమాను విచారించలేదు. శనివారం మళ్లి హనుమంతరాయప్పను విచారించనున్నారు. ఇప్పటికే రవి కారు డ్రైవర్ ఎళంగోవన్ ను విచారించిన సీబీఐ అధికారులు అతని స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications