పెళ్ళికి బ్యాండ్ మేళం వాడారని దళితులు వాడే బావిలో కిరోసిన్ కలిపారు
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా దళితులు, పీడితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తాజాగా జరిగిన ఘటన ఒకటి రుజువు చేసింది.
భోపాల్: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా దళితులు, పీడితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తాజాగా జరిగిన ఘటన ఒకటి రుజువు చేసింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మానా గ్రామంలోమేఘ్ వాల్ అనే దళితుడు తన కుమార్తె వివాహన్ని బ్యాండ్ బాజాతో ఘనంగా జరిపించాడు. దీన్ని సహించలేక కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దళితులు వినియోగించే తాగునీటి బావిలో కిరోసిన్ కలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్ 23న, మేఘ్ వాల్ తన కుమార్తె వివాహం ఘనంగా నిర్వహించాడు. వివాహా కార్యక్రమానికి వరుడు మోటార్ బైక్ పై వచ్చాడు. అనంతరం బ్యాండ్ మేళంతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో కొందరు అగ్రవర్ణాలవారు దీనికి అభ్యంతరం చెప్పారు.
గ్రామంలో కొందరు అగ్రవర్ణాలకు చెందినవారు మాత్రమే పెళ్ళి ఊరేగింపులు నిర్వహించాలని తమ అభ్యంతరాలను చెప్పారు.ఈ విషయాన్ని దళితులు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్ళారు.ఆయన గ్రామంలో పోలీసు బందో బస్తు ఏర్పాటు చేయించారు.
పోలీసుల ఆధ్వర్యంలో పెళ్ళి సంబరాలు ఘనంగా జరిగాయి.పరిస్థితి సాధారణస్థితికి చేరుకొందని భావించిన ప్రభుత్వయంత్రాగం పోలీసు బలగాలను వెనక్కు రప్పించింది. అయితే కొద్దిరోజులకే దళితులు తాగునీటి కోసం ఉపయోగిస్తున్న బావిలో గుర్తు తెలియని వ్యక్తులు భారీగా కిరోసిన్ కలిపారు.ఈ నీరు తాగడానికి పనికిరాకుండాపోయింది.
మేఘ్ వాల్ ను అతనికి మద్దతుగా నిలిచిన దళితులను దేవాలయంలోకి రాకుండా స్థానిక గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అయితే మంచినీటి కోసం స్థానికులు సమీపంలో ఉన్న నది వద్దకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకొంటున్నారు. దళితుల కోసం త్వరలోనే రెండు చేతిపంపులను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లాయంత్రాంగం ప్రకటించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications