వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

video: గాలి నింపుతుండగా పేలిన జేసీబీ టైరు.. గాల్లో లేచిపడి ఇద్దరు వ్యక్తులు మృతి, తునాతునకలు

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుల్డోజర్ వాహనం టైరు నింపుతున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రాయ్‌పూర్ జిల్లా సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

పెద్ద టైరులో ఓ కార్మికుడు గాలి నింపుతున్నాడు. అదే సమయంలో మరో కార్మికుడు వచ్చి ఆ టైరులో గాలి ఎంత వరకు నిండిందనే విషయం తెలుసుకునేందుకు తనిఖీ చేస్తున్నాడు. టైరును రెండు మూడు సార్లు గట్టిగా నొక్కాడు. దీంతో ఆ టైరు పేలిపోయింది.

Video: Bulldozer Tyre Bursts While Air Being Filled, 2 Blown Into Pieces.

టైరు పేలడంతో అక్కడనే ఉన్న ఇద్దరు వ్యక్తులు గాలిలో పైకి లేచి కిందపడ్డారు. అక్కడంతా పొగలాంటి దుమ్ము లేచింది. దీంతో వారిద్దరూ అక్కడికకక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి శరీర భాగాలు కూడా చెల్లాచెదురుగా పడిపోవడం చూస్తే ఎంత భారీ స్థాయిలో ఈ పేలుడు సంభవించిందో తెలుసుకోవచ్చు.

కాగా, మృతి చెందిన ఇద్దరు కార్మికులు రాజ్‌పాల్ సింగ్, ప్రంజన్ నాందేవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాకు చెందినవారు. టైరు పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ టైరు పేలుడుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

English summary
Video: Bulldozer Tyre Bursts While Air Being Filled, 2 Blown Into Pieces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X