జియోకు షాక్: రూ.38లకే 100 ఎంబి డేటా, వాయిస్ కాల్స్
న్యూఢిల్లీ: వొడాఫోన్ కొత్త ప్యాకేజీని ప్రకటించింది.దేశంలోని మధ్య ప్రదేశ్, చత్తీష్ఘడ్, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత ప్రీపెయిడ్ కస్టమర్లకు వొడాఫోన్ చోటా ఛాంపియన్ ప్లాన్ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది.రూ. 38లకే ఈ ఆఫర్ను ఇస్తున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది.
రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లు కూడ మార్చుతున్నాయి. తమ కష్టమర్లను ఆకర్షించేందుకు వొడాఫోన్ కూడ తాజాగా కొత్త టారిఫ్ ప్రకటించింది.
వొడాఫోన్ చోటా చాంపియన్ పేరుతో ఈ కొత్త ప్లాన్ను అమల్లోకి తెచ్చింది. రిలయన్స్ జియో ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ను ఇటీవలే ప్రకటించింది. అయితే కష్టమర్లను ఇతర కంపెనీల వైపుకు వెళ్ళకుండా ఉండేందుకు ఈ ప్యాకేజీని ప్రవేపెట్టిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చోటా ఛాంపియన్ ప్యాకేజీ
వోడాఫోన్ సోమవారం నాడు ఓ స్పెషల్ వాయిస్, డేటా ప్యాక్ను లాంచ్ చేసింది. మధ్య ప్రదేశ్, చత్తీష్ఘడ్, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత ప్రీపెయిడ్ కస్టమర్లకు వొడాఫోన్ చోటా ఛాంపియన్ ప్లాన్ను ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద రూ.38 రూపాయలకే 100 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యాన్ని కల్పించింది వొడాపోన్. 100ఎంబీ 3జీ, 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది.

తక్కువ ధరకే నెలంతా సౌకర్యం
తమ కస్టమర్లు ఇతర కంపెనీలకు తరలిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వొడాఫోన్ కొత్త ప్లాన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. చోటా ఛాంపియన్ ప్యాక్ అని తీసుకొచ్చారు. తక్కువ ధరలో నెలంతా ప్రయోజనాలను అందించడం ఇదే తొలిసారని వోడాఫోన్ ఇండియా కన్జ్యూమర్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ అవ్నీష్ కోస్లా తెలిపారు.

ఉచితంగా 100 ఎంబీ డేటా
వోడాఫోన్ కష్టమర్లకు ఈ ప్లాన్ కింద అదనంగా కస్టమర్లకు 100ఎంబీ డేటాను అందించనున్నారు. అంతేకాదు ఉచితంగా వాయిస్ కాల్స్ కూడ ఇవ్వనున్నారు. ఈ కారణంగా తమ కష్టమర్లు ఇతర టెలికం కంపెనీల వైపుకు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుందని వోడాపోన్ మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జియోకు పోటీగా వొడాఫోన్ ప్లాన్స్
ఇటీవలే వొడాఫోన్ తన కొత్త ఫస్ట్ రీఛార్జ్ కూపన్ రూ.496కు లాంచ్చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని కొత్త వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వొడాఫోన్ తీసుకొచ్చిన రూ.496 ప్లాన్, రిలయన్స్ జియో రూ.459 ప్లాన్కి గట్టి పోటీగా ఉంది. దీంతో పాటు వొడాఫోన్ ఎఫ్ఆర్సీ 177 ప్లాన్ను లాంచ్చేసింది. దీని కింద 28 రోజలు పాటు 28జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications