స్థోమత లేదు, పిల్లలకు మంచి చావు ప్రసాదించండటూ రాష్ట్రపతికి లేఖ..!
న్యూఢిల్లీ: తన 8 మంది పిల్లల్లో ఆరుగురికి ఎతినేషియా(అనాయాస మరణం)కు అనుమతి తెలపాల్సిందిగా కోరుతూ ఆగ్రాకు చెందిన 42 ఏళ్ల ఓ వ్యక్తి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. బాధితుడు నజిర్ రాసిన లేఖలోని వివరాలిలా ఉన్నాయి.
నేను మామూలు ఓ స్వీట్ దుకాణ నిర్వహకుడిని. నాకు ఎనిమిది మంది సంతానం. వీరిలో ఆరుగురు పిల్లలు కెనవాన్ అనే నరాల బలహీనత కలిగిన ఓ అరుదైన వ్యాధితో తీవ్ర వేదనను అనుభవిస్తున్నారు.

నా పెద్ద కుమారుడు, చిన్న కూతురు మాత్రమే సహజ ఎదుగుదలను కలిగి ఉన్నారు. వీరి పోషణ, చికిత్సకయ్యే ఖర్చును భరించలేకపోతున్నా. అంతే కాదు నా పిల్లల భవిష్యత్త పట్ల జాగ్రత వహించడంలో అలిసిపోయాను. అందుకే వారికి మంచి చావుని ప్రసాదించమని కోరుతున్నాను.
ఒకవేళ ఎతినేషియాకు అనుమతి నిరాకరిస్తే, పిల్లల వైద్యఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరాడు. ఆగ్రా జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఆదేశాలతో కుటుంబ పరిస్ధితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు నజీర్ కుటుంబాన్ని సందర్శించారు.
కుటుంబ సభ్యుల నుంచి ఆధార్, బీపీఎల్ కార్డులను తీసుకున్నారు. త్వరలోనే ప్రభుత్వం తరపు నుంచి తగిన సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications