బీజేపీకి షాక్: శివసేనకే మద్దతు... రాజ్ థాకరే-ఉద్దవ్ కలుస్తున్నారా?
బృహన్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో పరిస్థితి అయోమయంగా ఉంది.
ముంబై: బృహన్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో పరిస్థితి అయోమయంగా ఉంది. 227 స్థానాలు కలిగిన బీఎంసీలో శివసేన 84, బీజేపీ 82, కాంగ్రెస్ 31, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన 7, ఎన్సీపీ 9, మజ్లిస్ 3, ఇతరులు 11 స్థానాలను గెలుచుకున్నాయి.
మేయర్ పీఠం కావాలంటే 114 సభ్యులు కావాలి. ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీ, శివసేనలు మేయర్ పీఠం దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.
ఇదే సమయంలో మేయర్ ఎన్నికల్లో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ థాకరే సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. రాజ్ స్వయంగా చెప్పకపోయినా.. తన ఆప్తుడు బాలానంద గౌంకర్ ద్వారా వెల్లడించిన మాటలను బట్టి అర్థమవుతోందని అంటున్నారు.

శివసేనకు చెందిన వ్యక్తినే మేయర్గా చూడాలనుకుంటున్నామని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. మరాఠీల సంక్షేమం కోసం రాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. శివసేన కూడా మద్దతు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
అయితే మద్దతు ఇచ్చినందుకు ప్రతిగా రాజ్ థాకరే మనుషులకు కీలకమైన కమిటీల్లో స్థానం ఇవ్వాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుందామన్న రాజ్ ప్రతిపాదనను ఉద్ధవ్ థాకరే తోసిపుచ్చినందున రాజ్ థాకరే కోపంగా ఉన్నారని, తన ప్రతిపాదనకు శివసేన అంగీకరించినట్లయితే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదని, పూర్తి మెజారిటీ లభించేదని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.
ఒకవేళ శివసేన - ఎంఎన్ఎస్ కలిస్తే మహారాష్ట్రలో బీజేపీకి షాక్ ఖాయమని అంటున్నారు. శివసేన లేదా ఎంఎన్ఎస్ మద్దతు కోసం బీజేపీ ఎప్పటికి అప్పుడు ఎదురు చూస్తోంది. వారిద్దరి కలిస్తే బీజేపీ ఏకాకి కావడం ఖాయమంటున్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications