దేశంలో కరోనా డాక్టర్లకు ఊరట- విశ్రాంతి ఇస్తామని సుప్రీంకు తెలిపిన కేంద్రం
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి లక్షలాది మంది వైద్యులు, వైద్య సిబ్బంది, సహాయకులు, పారా మెడికల్ సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా లక్షల మందిని కరోనా వైరస్ బారి నుంచి గట్టెక్కించారు. కరోనా వారియర్లుగా ముందు నిలిచి మునుపెన్నడూ లేని విధంగా దేశ ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కాస్త అదుపులోకి రావడంతో వీరికి విశ్రాంతి కల్పించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
దేశంలో కరోనా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో కోవిడ్ విధుల నుంచి డాక్టర్లకు విశ్రాంతి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. దేశంలో కోవిడ్ రోగులకు అందుతున్న సేవలపై నమోదైన సుమోటో పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం కోవిడ్ రోగులకు సేవలందించిన డాక్టర్లకు విశ్రాంతి ఇవ్వకపోతే వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హెచ్చరించింది.

కోవిడ్ రోగులకు అందుతున్న చికిత్స, మృతులకు మర్యాదపూర్వక అంతిమ సంస్కారాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీం ధర్మాసనం సూచించింది. అలాగే కోవిడ్ సేవల్లో ఉన్న డాక్టర్లకు కొంత విశ్రాంతి ఇవ్వాలని కూడా సూచించింది. దీంతో ఈ విషయం తమ పరిశీనలో ఉందని కేంద్రం తరఫున తుషార్ మెహతా సమాధానమిచ్చారు. మరోవైపు కోవిడ్ సమయంలో మాస్కులు ధరించని వారి నుంచి ఇప్పటివరకూ రూ.90 కోట్ల రూపాయల ఫైన్ వసూలు చేయడంపై సుప్రీంకోర్టు విస్మయం, అభ్యంతరం వ్యక్తం చేసింది.
-
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు












Click it and Unblock the Notifications