విషాదయాత్ర : ఈత కొడుతుండగా చెట్టు కూలి.. 20 మంది విద్యార్థుల దుర్మరణం
జలపాతం దగ్గర ఈత కొడుతున్న సమయంలో గాలుల ధాటికి భారీ వృక్షం నేలకూలిన ఘటనలో 20 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.
కిన్ టాంపో: ఆఫ్రికా దేశంలోని ఘనాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతం దగ్గర ఈత కొడుతున్న విద్యార్థులపై ఉన్నట్లుండి ఓ భారీ వృక్షం కూలింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.
ఘనా దేశంలోని కింటాంపో జలపాతం దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడికి విహారయాత్రకు వచ్చిన విద్యార్థులు జలపాతం దగ్గర ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలోనే తుపాన్ వచ్చింది.

ఒక్కసారిగా పెనుగాలులు వీచడంతో ఆ ధాటికి అక్కడే ఉన్న ఓ వృక్షం ఒక్కసారిగా నేలకూలి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో మరో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద స్థలికి ఘనా అగ్నిమాపక శాఖ సహాయ కార్యక్రమాలు చేపట్టింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థుల్లో మరికొంతమంది పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది వెంచీ సీనియర్ హైస్కూల్ విద్యార్థులని, మిగిలిన వారు పర్యాటకులని అధికారులు వెల్లడించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications