వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాని వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం లేదు, ఎవరూ భంగం కలిగించలేరు: చైనా

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా - పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ భారత్‌కు వ్యతిరేకం కాదని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. దీనిని ఏ మూడో దేశం కూడా ప్రభావితం చేయలేదని, భంగం కలిగించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు చైనా దేశ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హువా చునియాంగ్ మాట్లాడారు.

చదవండి: మళ్లీ సర్జికల్ దాడులు: పాక్‌కు యోగి వార్నింగ్, 'జాగ్రత్త లేదంటే ఆలోచించేలోపు దెబ్బకొడతాం'

చైనా పాకిస్తాన్ కారిడార్‌ను ఆఫ్గనిస్తాన్ వరకు విస్తరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు మూడు దేశాల ప్రతినిధులు మంగళవారం భేటీ అయ్యారు. ఆప్గన్ వరకు విస్తరణపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందంటూ వచ్చిన వార్తలపై చైనా స్పందించింది.

CPEC Offer to Afghanistan Not Directed Against India: China

దీనిని తాము ఏ దేశానికి వ్యతిరేకంగా నిర్మించడంలేదని చెప్పారు. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఈ ప్రాజెక్టును చేపట్టడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని విలేకరులు ప్రశ్నించారు.

దీనిపై హువా చునియాంగ్ మాట్లాడుతూ.. దీని వల్ల ఏ దేశానికి నష్టం ఉండదని తాము చెబుతున్నామని, దీని వల్ల మూడో దేశానికి ప్రయోజనాలు ఉంటాయని భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయం తగదన్నారు.

English summary
A day after it offered Afghanistan partnership in the $50 billion China-Pakistan Economic Corridor (CPEC) project, China said that the project was not directed against India. The country also said that no third country should try to influence or disturb the project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X