ఫ్రాన్స్లో మరోసారి ఉగ్రదాడి: 80 మంది దుర్మరణం
పారిస్: ఫ్రాన్స్లోని నైస్ నగరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాద దాడిలో 77 మంది మరణించారు. గత 8 నెలల కాలంలో నైస్ నగరంలో ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి. మందుగుండు సామగ్రితో ఉన్న భారీ ట్రక్కు ఉత్సవాలు జరుపుకుంటున్న జనంపైకి దూసుకెళ్లింది.

ఉగ్రవాదులే ట్రక్కుతో దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఫ్రాన్స్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ దాడిలో మరో వందికి పైగా గాయపడ్డడారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రక్కులోని వ్యక్తులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
దాంతో బుల్లెట్లతో ట్రక్కుకు తూట్లు పడ్డాడయి. ఘటన జరిగిన వెంటనే నైస్ నగరాన్ని ఉగ్రవాద వ్యతిరేక దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ట్రక్కు డ్రైవర్ కాల్పుల్లో మరణించాడు. ట్రక్కులో 31 ఏళ్ల ఫ్రెంచ్ టునీషియా పౌరుడికి చెందిన పత్రాలు కనిపించినట్లు, భారీగా ఆయుధాలూ తుపాకులు ఉన్నట్లు అధికార వర్గాలు చెప్పాయి.

నగరంలో ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని నైస్ నగర మేయరు క్రిస్టియన్ ఈస్ట్రోసి కోరారు. నిరుడు నవంబరులో ప్యారిస్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 130 మంది మరణించారు.
ఫ్రాన్స్ లో జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. ఈ దాడిలో అమాయకులు మరణించారని వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఫ్రాన్స్ లో ఉన్న బ్రిటీష్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశం కోరింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications