గల్లంతైన సైనిక విమానం: అండమాన్ తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహాలు, శకలాలు
116మంది ప్రయాణికులతో గురువారం గల్లంతైన మయన్మార్ సైనిక విమాన శకలాలు, ప్రయాణీకుల మృతదేహాలు అండమాన్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చినట్లు ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు.
యంగూన్: 116మంది ప్రయాణికులతో గురువారం గల్లంతైన మయన్మార్ సైనిక విమాన శకలాలు, ప్రయాణీకుల మృతదేహాలు అండమాన్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చినట్లు ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు. గురువారం ఉదయం 8.25గంటల సమయంలో అండమాన్ సముద్ర తీరంలో అలలకు మూడు మృతదేహాలు కొట్టుకు వచ్చాయి.
మృతుల్లో ఒక మహిళ, చిన్నారి కూడా ఉన్నారు. అంతేగాక ఆ విమాన ప్రయాణికుల లగేజీ, సేఫ్టీ జాకెట్లు, ఎయిర్క్రాఫ్ట్ చక్రం ఒకటి లభ్యమయ్యాయి. మిగతా వారి మృతదేహాల కోసం నావికా దళ అధికారులు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు సైనిక సమాచార బృందం ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

మయన్మార్లోని లాంగ్లాన్ తీర ప్రాంతంలో విమాన శకలాన్ని గుర్తించినట్లు ఆర్మీ చీఫ్ ఆఫీస్ కమాండర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం సైనిక విమానం గల్లంతైన విషయం తెలిసిందే.
ఈ విమానంలో ఎక్కువ మంది సైనిక సిబ్బంది కుటుంబసభ్యులే ఉన్నారు. వారిలో 15 మంది చిన్నారులు, 35 మంది సైనికులు, 14 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు మయన్మార్ ఆర్మీ చీఫ్ కార్యాలయం వెల్లడించింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications