గడ్డైనా తింటాడు, అణుపరీక్షలు ఆపడు:కిమ్పై పుతిన్ ఫైర్
ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. గడ్డి తినేందుకైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సిద్దపడతాడు.
మాస్కో: ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. గడ్డి తినేందుకైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సిద్దపడతాడు. కానీ , అణుపరీక్షలను మాత్రం వదలడన్నారు పుతిన్.
కొరియా తాజాగా చేసిన అణుపరీక్షలను పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతమని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పటికిప్పుడు ఉత్తర కొరియా అధినేత కిమ్జాంగ్ ఉన్.. అణ్వస్త్ర పరీక్షలను అస్సలు ఆపరని తేల్చిచెప్పారు.
ఐక్యరాజ్యసమితి ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా కిమ్జాంగ్ తన తీరును మార్చుకోరని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఆఖరికి గడ్డి తినడానికైనా సిద్ధపడతారు కానీ.. అణ్వస్త్ర పరీక్షలను కిమ్ ఆపబోరని పుతిన్ స్పష్టం చేశారు.
అణ్వస్త్ర పరీక్షలు ఆపిన మరుక్షణమే ఏం జరుగుతుందో కిమ్జాంగ్కు తెలుసునన్నారు. అందుకే అణ్వస్త్ర పరీక్షలకు కిమ్ ఎంత ఖర్చుపెట్టడానికయిని సిద్ధపడుతున్నారన్నారు.
తాను మరో సద్దామ్హుస్సేన్లా మారతానేమోనని కిమ్కు భయం ఉందని, ఆ భయం, అభద్రతను అమెరికా తొలగిస్తేనే అణ్వస్త్ర పరీక్షలు చేయడం ఆపేస్తారని విశ్లేషించారు. ఆంక్షలతో లాభం లేదనీ, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలిన అమెరికాకు సూచించారు.












Click it and Unblock the Notifications