జాత్యహంకార హత్యే, ఖండిస్తున్నాం: శ్రీనివాస్ హత్యపై ట్రంప్ తొలిసారి, ఏమన్నారంటే..?
విద్వేష దాడులను ముక్త కంఠంతో ఖండించాలని, ఇలాంటి విద్వేష దాడులకు అమెరికాలో తావు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆయన భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అమెరికా కాంగ్రెస్ను ఉద్దే
వాషింగ్టన్: విద్వేష దాడులను ముక్త కంఠంతో ఖండించాలని, ఇలాంటి విద్వేష దాడులకు అమెరికాలో తావు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆయన భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా అమెరికా జాత్యాహంకారి కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల మృతికి అమెరికా కాంగ్రెస్ నిమిషంపాటు మౌనం పాటించారు. శ్రీనివాస్ది జాత్యాహంకార దాడేనని వైట్ హౌజ్ అంగీకరించింది.
కాగా, మళ్లీ అమెరికాకు పునర్ వైభవం తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బరాక్ ఒబామా పాలనలో దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఉగ్రదాడుల్లో అమెరికాలోని అమాయకులు బలయ్యారని అన్నారు. అమెరికా పౌరులను రక్షించే బాధ్యత తనదేనని అన్నారు.
తాను నెల రోజుల్లో అద్భుతంగా పనిచేశానని చెప్పుకొచ్చారు. తమ హయాంలో దేశంలో అవినీతికి తావులేదని చెప్పారు. బొగ్గు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయని తెలిపారు. ఇమ్మిగ్రేట్ చట్టాల్లో మార్పులు తెచ్చానని తెలిపారు.
ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో అమెరికా సురక్షితంగా ఉంటుందని చెప్పారు. లాబీయింగ్ పై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఒబామా.. అమెరికాను వదిలేసి ఇతర దేశాల సరిహద్దులు కాపాడారని ఆరోపించారు. అమెరికా, మెక్సికో మధ్య గోడ కట్టితీరుతానని స్పష్టం చేశారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అమెరికా వస్తువులనే కొనాలని, అమెరికా వారికే ఉద్యోగాలివ్వాలని కోరారు.
ముస్లిం వర్గాల మద్దతుతో ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేస్తామని తెలిపారు. నేరగాళ్ల ఆగడాలను అరికడతామని చెప్పారు. అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని స్పష్టం చేశారు. అమెరికా ముందుండి ప్రపంచాన్ని నడిపిస్తుందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications