శ్రీకాకుళం ప్రమాదంలో పోలీసుల మృతిపై హోంమంత్రి, డీజీపీ సంతాపం-దర్యాప్తుకు ఆదేశం
శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందడం పలువురిని కలిచి వేస్తోంది. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం కూడా స్పందించింది. ఘటనపై సమాచారం అందగానే ఆరా తీసిన హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ పోలీసుల మృతికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలిపారు. ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రమాద కారణాలను ఆరా తీయడంతో పాటు సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
శ్రీకాకుళంలోని భైరిసారంగపురంలో ఓ జవాను మృతదేహం అప్పగించి ఏఆర్ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఈ ఘటనలో ఓ ఏఆర్ ఎస్సైతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఓ కానిస్టేబుల్ చనిపోయినట్లు సవాంగ్ ప్రకటించారు. తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డిఐజి, జిల్లా ఎస్పీని డిజిపి సవాంగ్ ఆదేశించారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని డీజీపీ సవాంగ్ జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నలుగురు పోలీసుల మరణం మా పోలీస్ కుటుంబానికి తీరని లోటని డీజీపీ సవాంగ్ తెలిపారు. మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి కుటుంబలకు అండగా ఉంటుందన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందడం బాధాకరమన్నారు.
మృతుల కుటుంబాలకు హోంమంత్రి సుచరిత ప్రఘాడ సానుభూతిని తెలిపారు. ఓ జవాను మృతదేహం అప్పగించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications