Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దావోస్ లో తెలంగాణా పంట పండింది: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి స్విస్ మాల్!

ప్రపంచ ఆర్థిక వేదిక అయిన దావోస్ సమావేశాల్లో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో బంపర్ అవకాశాలు వస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో దశల వారీగా వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ విమాన యాన సంస్ధ సర్గడ్ ముందుకు వచ్చింది. అంతేకాదు హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి 'స్విస్ మాల్' నిర్మాణ ఆలోచన ప్రతిపాదనకు స్విస్ ప్రతినిధి బృందం వెంటనే సానుకూల స్పందన వ్యక్తం చేయడం కూడా తెలంగాణాకు శుభవార్త చెప్పింది.

యూఎస్ కు చెందిన సర్గడ్ సంస్ధతో ఒప్పందం
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సర్గాడ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్ తోట, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వంతో సర్గడ్ సంతకం చేసింది. సర్గడ్ సంస్ధ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. సర్గాడ్ సంస్థకు ఏరోస్పేస్, రక్షణ, ఆటోమొబైల్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో విశేష అనుభవం ఉంది.

big-boost-for-telangana-at-davos-rs-1-000-crore-investments-world-s-first-swiss-mall-in-hyderabad

రష్మి గ్రూప్ రాష్ట్రంలో 12500కోట్ల పెట్టుబడులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాంతాల్లో ఏదైనా ఒక చోట సర్గడ్ సంస్థ తమ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థ సీఈఓకు సూచించారు. డక్ట్రెల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ రాష్ట్రంలో 12500కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేదికపై ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

ఏబీ ఇన్ బెవ్ ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ తయారీ కంపెనీ పెట్టుబడులు
ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థ ఏబీ ఇన్ బెవ్... తెలంగాణలో ఇప్పటికే ఉన్న తమ తయారీ యూనిట్ ను విస్తరించేందుకు భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. మరొక సమావేశంలో టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయి.. విజన్-2047 లక్ష్యాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల విధానాలను వివరించారు.

భారత్-స్విట్జర్లాండ్ మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందంతో సహకారంపై చర్చలు
అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్‌లోని వాడ్ (Vaud) కౌన్సిల్ ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్‌తో చర్చలు నిర్వహించారు. భారత్-స్విట్జర్లాండ్ మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకారం, భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌ను స్విస్ ప్రతినిధులకు వివరించారు.

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి స్విస్ మాల్
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, మౌలిక వసతులు, యువత నైపుణ్య అభివృద్ధి, మహిళా సాధికారతపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అదే సమయంలో హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి 'స్విస్ మాల్' నిర్మాణ ఆలోచనను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు స్విస్ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించటంతో తెలంగాణా దావోస్ సదస్సులో భారీ పెట్టుబడులను ఆకర్షించినట్టు అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+