తెలంగాణా సీఎం కేసీఆర్ మరో కొత్తపథకం: వారికోసం న్యూట్రిషన్ కిట్; ఈ జిల్లాలలోనే అమలు!!
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కిట్ తరహాలో మరో అద్భుతమైన పథకానికి తెలంగాణా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ సంవత్సరం కెసిఆర్ కిట్ తరహాలో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అందించబోతున్నామని ప్రకటించారు. సాక్షాత్తు ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

న్యూట్రిషన్ కిట్ ద్వారా రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణీలకు లబ్ది
ఇప్పటికే కెసిఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచామని పేర్కొన్న హరీష్ రావు, న్యూట్రిషన్ కిట్ ద్వారా రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణీలకు కావలసిన న్యూట్రిషన్ అందించి మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని హరీష్ రావు వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కెసిఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి హరీష్ రావు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని గురించి వెల్లడించారు.

కేసీఆర్ కిట్ ద్వారా ఆసుపత్రులలో 54 శాతం పెరిగిన ప్రసవాలు
కెసిఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని, గర్భిణీల మరణాల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. 2017 జూన్ 2 నుండి ఇప్పటి వరకు ఈ పథకం కింద 13,29,951 మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఈ పథకం అమలు కోసం 1387.19 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కెసిఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో 54 శాతం ప్రసవాలు పెరిగాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.

9 జిల్లాలలో న్యూట్రిషన్ కిట్ పథకం
గతంలో ప్రసవాలకు వచ్చిన తల్లుల మరణాలు ప్రతి లక్షకు 94 ఉండేవని, ప్రస్తుతం కెసిఆర్ కిట్ అమలవుతున్న సమయంలో మరణాలు 63 తగ్గాయని, శిశు మరణాలను కూడా తగ్గించుకున్నామని మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో త్వరలో న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు అవుతుందని పేర్కొన్న మంత్రి హరీష్ రావు న్యూట్రిషన్ కిట్ పథకం ద్వారా రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు పోషకాలను అందిస్తామని వెల్లడించారు.
Recommended Video

న్యూట్రిషన్ కిట్ అమలయ్యే జిల్లాలు ఇవే
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, కొమరం భీమ్ ఆదిలాబాద్ జిల్లాలలో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి కృషి చేస్తుందని, మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పిన మంత్రి హరీష్ రావు కొత్తగా 23 మాతా శిశు సంక్షేమ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications