విషాదం: ఒక్కసారిగా వేగం పెంచిన డ్రైవర్: బస్సు కిందపడి కండక్టర్ మృతి
హైదరాబాద్: నగరంలోని వేవ్ రాక్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ కండక్టర్ మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు గ్రామానికి చెందిన గడ్డం రాములు(55) నగరంలోని మోతీనగర్లో నివాసముంటున్నారు. ఈయన కూకట్పల్లి బస్డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు.
కాగా, ఆగస్టు 12వతేదీన రోజువారి విధుల్లో భాగంగా బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని మైత్రీవనంనుంచి నానక్రాంగూడ ఫైనాన్షియల్ జిల్లాలోని వేవ్రాక్ బస్టాప్లో దింపారు. మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లేందుకు డ్రైవర్ కిరణ్కుమార్ బస్సును వేగంగా మలుపుతుండగా వెనుక తలుపునుంచి కండక్టర్ రాములు ఒక్కసారిగా కిందపడ్డారు.

గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపి స్థానికుల సహాయంతో అతన్ని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ రాములు మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. రాములు మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో తన తోటిఉద్యోగి మరణించడంతో ఆ బస్సు డ్రైవర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications