వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యాపేట జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తొలివిడత పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో ఊహించని విచిత్ర సంఘటనలతో పాటు పలు ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు బ్యాలెట్ ఎన్నికలు కావటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ నేపధ్యంలోనే హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేసిన రాజకీయ పార్టీల నాయకులు పోలింగ్ సమయంలోనూ ఘర్షణలకు దిగుతున్నారు.

తెలంగాణలో జరుగుతున్న తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద బాహాబాహీకి దిగారు. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఓటు వేస్తామంటూ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన ఇరు పార్టీల అభ్యర్థులు లోపల ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో వాగ్వాదం మొదలయ్యింది. దీంతో వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసి ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

congress, TRS activists fight in suryapet district .. why because
English summary
Elections are being held for MPTC and ZPTC in Telangana state. Suryapet district, A quarrel happened in keethavari gudem poling station. congress and TRS party activists allegated that two parties who went to the polling center were promoting the parties for vote. This led to a clash of arguments. The police intervened and controlled the two sides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X