బ్యాంకులు, కార్డ్ హోల్డర్లే టార్గెట్: 10మంది నైజీరియన్ల అరెస్ట్
నగరంలోఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న 10 మంది నైజీరియన్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్: నగరంలోఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న 10 మంది నైజీరియన్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరాలను వెల్లడించారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న వీరిని ఢిల్లీలో అరెస్టు చేశామని తెలిపారు.
నైజీరియన్ల నుంచి 9 ల్యాప్ట్యాప్స్, 26 మొబైల్స్, 10 ఇంటర్నెట్ డాంగిల్స్, 35 సిమ్కార్డులు, ఒక ఐపాడ్, హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేశ్ తెలిపారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డుల నుంచి ఈ ముఠా డబ్బులు దొంగిలిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.

నిందితులు ఫేస్బుక్ ద్వారా పరిచయాలు చేసుకొని డబ్బులు లూఠీ చేస్తున్నారని తెలిపారు. కొరియర్లు వచ్చాయి.. రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాలంటూ నైజీరియన్లు మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ వివరించారు.
నైజీరియన్ల ముఠాపై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కేసులు ఉన్నాయని తెలిపారు. పాస్పోర్టు లేకుండా నగరంలో నైజీరియన్లు ఉన్నారని తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చి నగరంలో నివాసం ఉంటున్న వారి కోసం సమగ్ర సర్వే నిర్వహించామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. అక్రమంగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications