కొత్త విద్యా సంవత్సరం మార్చి 21 నుంచి... ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు
తెలంగాణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అకడమిక్ కేలండర్ (ముసాయిదా విద్యా సంవత్సర ప్రణాళిక)ను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అకడమిక్ కేలండర్ (ముసాయిదా విద్యా సంవత్సర ప్రణాళిక)ను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది.
2017-18 విద్యా సంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించాలని, అలాగే వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నూతన అకడమిక్ కేలండర్ ను ఉపాధ్యాయ సంఘాలకు పంపించింది.
ఈ ప్రణాళికపై ఆయా సంఘాలతో చర్చించి, మార్పు చేర్పులతో ఖరారు చేయనుంది. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలల్ని తిరిగి ప్రారంభించనుంది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉదయం 9:30 గంటలకు.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9:00 గంటల నుంచి ప్రారంభించాలని ప్రతిపాదించింది.
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జులై, ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగనున్నాయి. ఇక వచ్చే ఏడాది పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను 2018 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు లేదా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు నిర్వహిస్తారు.