Air India: హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ హార్డ్ ల్యాండింగ్..! ఏం జరిగిందంటే ?
హైదరాబాద్ (hyderabad) నుంచి థాయ్ లాండ్ లోని ఫుకెట్ విమానాశ్రయానికి వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ 737 బోయింగ్ విమానం (air india) ఇవాళ అత్యవసరంగా హార్డ్ ల్యాండ్ అయింది. ఫుకెట్ విమానాశ్రయంలో రన్ వేపై నోస్-వీల్ సమస్య తలెత్తడంతో ఈ విమానాన్ని పైలట్లు హార్ట్ ల్యాండింగ్ చేశారు. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 133 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది భయభ్రాంతులయ్యారు. చివరికి వారంతా ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇవాళ థాయిలాండ్ లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం హార్డ్ ల్యాండింగ్ చేయడం వల్ల దాని ల్యాండింగ్ గేర్ దెబ్బతింది. అలాగే రన్ వే కూడా దెబ్బతిని విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇవాళ మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్-ఫుకెట్ మార్గంలో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 రన్వేపై సమస్య ఎదుర్కొంది. VT-BWQ రిజిస్ట్రేషన్ కలిగిన ఈ విమానంలో చక్రం విడిపోయింది. దీనికి హార్డ్ ల్యాండింగే కారణమని ప్రాథమికంగా తేలింది.

ప్రాథమిక తనిఖీల్లో ఎయిరిండియా విమానం నోస్ ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నట్లు తేలింది. దీని వలన విమానం వెంటనే రన్వే నుండి ముందుకు కదలదు. ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 131 మంది ప్రయాణికులు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం 133 మంది ప్రయాణికులను సురక్షితంగా దింపి వేచి ఉండే ప్రాంతానికి తరలించారు. వీరిలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. తమ సిబ్బంది అన్ని ప్రామాణిక ప్రోటోకాల్లను పాటించారన, అతిథులను విమానం నుండి దింపారని ఎయిరిండియా తెలిపింది. మా అతిథులు, ఫుకెట్ విమానాశ్రయ అధికారులు, అందరి సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
-
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!














Click it and Unblock the Notifications