స్నేహితుడ్ని బస్సెక్కించేందుకు వెళ్లి: ఇద్దరు విద్యార్థినుల దుర్మరణం
హైదరాబాద్: మిత్రుడిని బస్సు ఎక్కించి తిరిగి కాలేజీకి వెళ్తున్న విద్యార్థులను మృత్యు రూపంలో వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఇద్దరు విద్యార్థునిలు దుర్మరణం చెందగా మరో విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ సంఘటన శుక్రవారం రాత్రి రాజీవ్ రహదారి అలియాబాద్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందిన పల్లవీ గుప్తా, చెన్నైకి చెందిన వీణ మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం జగ్గంగూడ గ్రామ పరిధిలోని నిక్మార్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు.

శుక్రవారం రాత్రి తమ మిత్రుడు చిరంజీవి మెహతాను నాగపూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కించారు. ఆ సమయంలో వారితో పాటు కుశాల్ అనే మరో స్నేహితుడు ఉన్నాడు.
కుశాల్, వీణ, పల్లవిలు స్కూటీపై కొంపల్లి నుంచి జగ్గంగూడలోని కాలేజీకి బయలుదేరారు. రాజీవ్ రహదారి శామీర్ పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్దకు రాగానే వెనుక నుంచి ఓ లారీ వారిని ఢీకొట్టింది. ఇద్దరు యువతులు తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందారు. కుశాల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications