ట్రాఫిక్పై వినూత్నం: గదతో యమధర్మ రాజు రోడ్డుపైకి (ఫోటోలు)
హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ పాటించి, సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరండంటూ ఐసీబీఎం స్కూల ఆఫ్ బిజినెస్ ఎక్స్లెన్స్ విద్యార్ధులు వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు. మీ జీవితం మీ చేతిలో ఉంది. రూల్స్ పాటించకపోతే ప్రమాదాలు జరుగుతాయని ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు.
వినూత్న పద్ధతిలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన
సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపించే క్రమంలో జరిగే ప్రమాదం, ఆ క్రమంలో యముడు ప్రాణం తీసికెళ్తున్న సన్నివేశాలను కళ్లకు గట్టినట్లు వివరించారు.
వినూత్న పద్ధతిలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన
మధ్యం తాగి వాహనం నడపొద్దని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని వాహనదారులకు సూచించారు.
వినూత్న పద్ధతిలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన
మరీ ముఖ్యంగా సిగ్నల్లో గ్రీన్ లైట్ వచ్చినప్పుడే ముందుకు వెళ్లాలని, సిగ్నల్స్ వద్ద వాహనాలను నిలిపే లైన్ను క్రాస్ చేయవద్దంటూ విద్యార్ధులు వాహనదారులకు సూచించారు.
వినూత్న పద్ధతిలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన
సెల్ఫోన్ ధరించి విద్యార్ధితో పాటు యమధర్మరాజు వేషధారణ, గదలను పట్టుకొని వాహనదారులను కలిసి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ పర్యవేక్షణలో ట్రాఫిక్ శిక్షణ కేంద్రం ఇన్స్పెక్టర్ శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు.
వినూత్న పద్ధతిలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన
సామాజిక
కార్యక్రమాల్లో
భాగంగా
తమ
విద్యార్ధులతో
కలిసి
జూబ్లీహిల్స్
చెక్
పోస్టు,
పబ్లిక్
గార్డెన్స్
ఎదురుగా
కంట్రోల్
రూమ్
చౌరస్తాలో
వాహనదారులతో
మాట్లాడారు.