కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం రావణ కాష్టం: భారీ కుట్ర!
తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్ కేసు దుమారం రేపుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏ వన్ నిందితుడిగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగింది.
కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసు
ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కాపీ, సంబంధిత డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ అధికారులు ఏసీబీ డీజీకి లేఖ రాశారు. ఇక ఈ కేసులో ఏ క్షణానైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక కోర్టులో కేటీఆర్ ఈ కేసు నుండి ఉపశమనం కోసం ప్రయత్నిస్తున్నారు.

కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో జరిగేది ఇదే
అయితే ఇదే సమయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అరెస్టు చేస్తే రాష్ట్రంలో అల్లర్లకు బీఆర్ఎస్ పార్టీ పకాగా ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చెయ్యాలని ప్లాన్ జరుగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లంచ్ బ్రేక్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఒకవేళ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు చేస్తే ఏం జరుగుతుందో చెప్పారు.
అల్లర్ల కోసం నియోజకవర్గానికి కోటి రూపాయలు
రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చేయడానికి బిఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున డబ్బు ఇప్పటికే ముట్టజెప్పింది అని కూడా సంచలన ఆరోపణలు చేశారు. అల్లర్లలో భాగంగా ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కుట్రలను ఎక్కడికి అక్కడ తిప్పి కొట్టాలని ఆయన పోలీసులకు సూచించారు.
పోలీసులు అలెర్ట్ గా ఉండాలన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కేటీఆర్ ఆత్మ, బినామీ అయిన తేలుకుంట్ల శ్రీధర్ ఈ మేరకు కుట్రలు చేస్తున్నారని, ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయల డబ్బులు పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications