సర్కస్ కంపెనీలా బీజేపీ; బండి సంజయ్ మూర్ఖుడు: జీవన్ రెడ్డి, కడియం శ్రీహరి ఫైర్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై, తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నేతలపై టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా బిజెపి నేతలపై మాటల దాడికి దిగారు. తాజాగా మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను, బీజేపీని టార్గెట్ చేశారు.
బండి సంజయ్ ఒక మూర్ఖుడు: కడియం శ్రీహరి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక మూర్ఖుడు అని, బండి సంజయ్ కు చదువురాదని, ఎలా మాట్లాడాలో తెలియదని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ వాడుతున్న భాష అభ్యంతరకరమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హన్మకొండలో మీడియా సమావేశంలో మాట్లాడిన కడియం శ్రీహరి తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ పై బీజేపీ నేతల మాటల దాడి అందుకే: కడియం శ్రీహరి
రాజీనామా చేయమంటే కిషన్ రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో అవకాశం ఉందని, ఈ క్రమంలోనే కెసిఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలని బిజెపి నేతలు దాడి చేస్తున్నారంటూ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏముంది అని ప్రశ్నించిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బండి సంజయ్ రాష్ట్రం కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణాపై ప్రేమ ఉందన్న బీజేపీ నేతలు చేసింది ఏంటి?
317 జీవోపై వరంగల్ లో బిజెపి నిరసన సభ పెడితే, ఏ ఒక్క ఉద్యోగి సంఘమైన, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘమైన పాల్గొన్నాయా చెప్పాలంటూ కడియం శ్రీహరి ప్రశ్నించారు. బిజెపి నేతలు ఇప్పటి వరకు రాష్ట్రం కోసం చేసింది ఏంటో చెప్పాలని నిలదీశారు. మేడారం జాతరకు జాతీయ హోదా అయినా తీసుకువచ్చారా అంటూ మండిపడ్డారు కడియం శ్రీహరి. తెలంగాణ పై బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి లకు ప్రేమ ఉంటే ప్రత్యేక నిధులు తీసుకురావాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
బిజెపి రాజకీయ పార్టీ కాదు , సర్కస్ కంపెనీలా మారింది: జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్ పై, టిఆర్ఎస్ నాయకుల పై బిజెపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. బిజెపి దేశ వ్యాప్తంగా ఉనికిని కోల్పోయిందని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికలలో బిజెపికి ఘోర పరాభవం తప్పదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బిజెపి రాజకీయ పార్టీలా లేదని, సర్కస్ కంపెనీలా మారిందని, బండి సంజయ్ సర్కస్ కంపెనీ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. చిన్నప్పుడు బాంబే సర్కస్ కంపెనీ అని విన్నామని, దానిని బిజెపి మించిపోయిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Recommended Video
జాతీయ నాయకులు, బీజేపీ సీఎంలు సర్కస్ కంపెనీలో జోకర్లు : జీవన్ రెడ్డి
బిజెపి
సీఎంలు,
జాతీయ
నాయకులు
సర్కస్
కంపెనీలో
జోకర్
ల
మాదిరిగా
మారారని
జీవన్
రెడ్డి
వ్యంగ్యాస్త్రాలు
సంధించారు.
గెలవలేని
జాతీయ
నేత
మురళీధర్
రావు
కూడా
కేసీఆర్
ను
విమర్శించే
వాడా
అంటూ
నిప్పులు
చెరిగారు
జీవన్
రెడ్డి.
టచ్
చేయాలని
చూస్తే
తెలంగాణ
అగ్నిగుండం
అవుతుందని
మండిపడ్డారు.
బీజేపీ
నేతలకు
కళ్ళు
లేవని
అందుకే
వారికి
తెలంగాణ
అభివృద్ధి
కనిపించటం
లేదని
మండిపడిన
జీవన్
రెడ్డి
బీజేపీ
నేతలకు
ఒంటినిండా
కుళ్లే
ఉందని
అసహనం
వ్యక్తం
చేశారు.