చంద్రగ్రహణం ఎఫెక్ట్: తెలంగాణా యాదాద్రి, వేములవాడ రాజన్నతో పాటు ప్రముఖఆలయాల మూసివేత, పునః దర్శనాలిలా!!
నేడు చంద్రగ్రహణం కారణంగా తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మూతపడుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5:32 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. మొత్తం చంద్రగ్రహణం దశ వ్యవధి 01 గంట 24 నిమిషాలు 28 సెకన్లు పాటు ఏర్పడుతుంది. చంద్ర గ్రహణ కాలంలో ఎప్పుడూ ఆలయాలను తెరచి ఉంచరు. ఈ క్రమంలో తెలంగాణాలోని ప్రముఖ ఆలయాలు ఎప్పుడు మూతపడతాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయి అన్న వివరాల విషయానికి వస్తే..

నేడు యాదాద్రి ఆలయం మూసివేత, మళ్ళీ దర్శనం రేపే
తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలోని యాదాద్రి పుణ్య క్షేత్రంలో కొలువైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని ఈరోజు ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి మూసివేసి రాత్రి 8 గంటలకు తెరచి ఆలయాన్ని సంప్రోక్షణ నిర్వహిస్తారు అర్చకులు. ఆపై రేపు రేపటి నుండి యధావిధిగా దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

వేములవాడ రాజన్న ఆలయం మూసివేత, తిరిగి తెరుచుకునే సమయాలివే
ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు ఇప్పటికే మూసివేశారు. చంద్ర గ్రహణం కారణంగా స్వామి వారి ఆలయాన్ని మూసివేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం సుప్రభాత సేవ అనంతరం రాజరాజేశ్వర స్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం, నాగేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం ఉదయం 5 గంటల 38 నిమిషాలకు మూసివేశారు. గ్రహణం విడిచిన తర్వాత ఆలయ సంప్రోక్షణ చేసి రాత్రి 8 గంటలకు యధావిధిగా భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.

ధర్మపురి నరసింహస్వామి, కాళేశ్వరం ఆలయాలలో ఇలా
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఉదయం ఐదు గంటలకే పూజాదికాలు పూర్తిచేసిన ఆలయ అర్చకులు ఆరు గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రేపు ఉదయం 6 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ అభిషేకం నిర్వహించి 9 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. కాళేశ్వరం లోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం తో పాటు అనుబంధ ఆలయాలను కూడా ఈరోజు ఉదయం 7 గంటలకే మూసివేశారు. ప్రాతఃకాల పూజ అనంతరం ఆలయాలను మూసివేశారు. రేపు ఉదయం ఆలయాలను సంప్రోక్షణ చేసిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి భక్తులను అనుమతిస్తారు.

జోగులాంబ ఆలయం మూసివేత .. పునః దర్శనం సమయం ఇదే
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత ఆలయ సంప్రోక్షణ నిర్వహించి ఏడున్నర గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications