Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీకల్లోతు చిక్కుల్లో మంత్రి కొండా సురేఖ.. శరవేగంగా అనూహ్య పరిణామాలు!

మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండా సురేఖ నివాసం వద్ద, మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు ఔట్ పోస్టును కూడా పోలీసులు తొలగించారు. ఇక తాజా పరిణామాలపై కొండా ఫ్యామిలీ భగ్గుమంటుంది.

తాజా పరిణామాలపై స్పందించిన కొండా మురళి
కొండా సురేఖ వ్యక్తిగత ఓఎస్డి గా పనిచేసిన సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. నేడు హన్మకొండలోని రాంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి అన్నారు. సురేఖ మంత్రి కార్యాలయానికి తను ఒకసారి వెళ్ళానని, అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదన్నారు.

Minister Konda Surekha in deep trouble Unexpected developments at a rapid pace

Take a Poll

ఎవరో కావాలని చేస్తున్న సృష్టి
హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు ఎవరో కావాలని చేస్తున్న సృష్టిగా ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావాలని తాను సురేఖ కష్టపడ్డామని, వైయస్సార్ తర్వాత రేవంత్ రెడ్డిని అంతగా తాము నమ్మమన్నారు. ఏ మంత్రులతో తమకు విభేదాలు లేవని, అందరి మంత్రుల ఇళ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం తనకు ఉందని కొండా మురళి తెలిపారు.

మాకు ఎవరితో విబేధాలు లేవు
రేవంత్ రెడ్డికి తమకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఎవరైనా సృష్టిస్తే దాంతో మాకు సంబంధం లేదని ఆయన అన్నారు. తాను వరంగల్లో అబ్జర్వర్స్ ప్రోగ్రాంకి వెళుతున్నానని పేర్కొన్న ఆయన జరుగుతున్న పరిణామాలు తెలుసుకొని స్పందిస్తాం అన్నారు. కొండా సురేఖ హైదరాబాద్ లో ఉన్నారని ఈరోజు వరంగల్ తూర్పు లో సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.

తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించిన కొండా సురేఖ కుమార్తె
తాను కొండ సుస్మితతో మాట్లాడానని, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చెప్పారని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు, తప్పకుండా ఇస్తారంటూ కొండా మురళి పేర్కొన్నారు. కాగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఆమె ఒక వీడియో విడుదల చేశారు. కొండా కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పేర్కొన్నారు.

తమ కుటుంబంపై కుట్ర చేస్తున్నారని ఆగ్రహం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం న‌రేంద‌ర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో స‌హా జిల్లా కు చెందిన క‌డియం శ్రీహ‌రి,బ‌స్వ‌రాజ్ సారయ్య‌, ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి అంద‌రూ క‌లిసి మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నార‌ని, త‌మ కుటుంబాన్ని వేధిస్తున్నార‌ని, తమపై కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు.

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదన్న కొండా సుస్మిత
ప్ర‌స్తుతం ఇంట్లో తాను ఒక్క‌దాన్నే ఉన్నాన‌ని మా ఇంటి చుట్టూ పోలీసుల‌ను మోహ‌రించార‌ని ఆమె తెలిపారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌ని అయినా ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేద‌ని తెలిపారు. కొండా కార్య‌క‌ర్తులు ఎవ‌రూ భ‌య‌ప‌డద్ద‌ని అంద‌రూ ధైర్యంగా ఉండాల‌ని ఆమె కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+