పీకల్లోతు చిక్కుల్లో మంత్రి కొండా సురేఖ.. శరవేగంగా అనూహ్య పరిణామాలు!
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండా సురేఖ నివాసం వద్ద, మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు ఔట్ పోస్టును కూడా పోలీసులు తొలగించారు. ఇక తాజా పరిణామాలపై కొండా ఫ్యామిలీ భగ్గుమంటుంది.
తాజా పరిణామాలపై స్పందించిన కొండా మురళి
కొండా సురేఖ వ్యక్తిగత ఓఎస్డి గా పనిచేసిన సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. నేడు హన్మకొండలోని రాంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి అన్నారు. సురేఖ మంత్రి కార్యాలయానికి తను ఒకసారి వెళ్ళానని, అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదన్నారు.

ఎవరో కావాలని చేస్తున్న సృష్టి
హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు ఎవరో కావాలని చేస్తున్న సృష్టిగా ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావాలని తాను సురేఖ కష్టపడ్డామని, వైయస్సార్ తర్వాత రేవంత్ రెడ్డిని అంతగా తాము నమ్మమన్నారు. ఏ మంత్రులతో తమకు విభేదాలు లేవని, అందరి మంత్రుల ఇళ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం తనకు ఉందని కొండా మురళి తెలిపారు.
మాకు ఎవరితో విబేధాలు లేవు
రేవంత్ రెడ్డికి తమకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఎవరైనా సృష్టిస్తే దాంతో మాకు సంబంధం లేదని ఆయన అన్నారు. తాను వరంగల్లో అబ్జర్వర్స్ ప్రోగ్రాంకి వెళుతున్నానని పేర్కొన్న ఆయన జరుగుతున్న పరిణామాలు తెలుసుకొని స్పందిస్తాం అన్నారు. కొండా సురేఖ హైదరాబాద్ లో ఉన్నారని ఈరోజు వరంగల్ తూర్పు లో సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.
తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించిన కొండా సురేఖ కుమార్తె
తాను కొండ సుస్మితతో మాట్లాడానని, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చెప్పారని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు, తప్పకుండా ఇస్తారంటూ కొండా మురళి పేర్కొన్నారు. కాగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఆమె ఒక వీడియో విడుదల చేశారు. కొండా కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పేర్కొన్నారు.
తమ కుటుంబంపై కుట్ర చేస్తున్నారని ఆగ్రహం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో సహా జిల్లా కు చెందిన కడియం శ్రీహరి,బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందరూ కలిసి మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తమపై కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదన్న కొండా సుస్మిత
ప్రస్తుతం ఇంట్లో తాను ఒక్కదాన్నే ఉన్నానని మా ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారని ఆమె తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని అయినా ఎవరికీ భయపడేది లేదని తెలిపారు. కొండా కార్యకర్తులు ఎవరూ భయపడద్దని అందరూ ధైర్యంగా ఉండాలని ఆమె కోరారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications