మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ .. ఆమన్ గల్ లో కమల వికాసం
రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల బలాబలాలు తెలియజేసే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల్లో అధికార టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కొన్ని వార్డుల్లో విజయం సాధించినప్పటికీ.. అనుకున్న స్థాయిలో రాణించలేదని తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా అక్కడక్కడా తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది .
నారాయణ ఖేడ్ లో కాంగ్రెస్ విజయం ..మధిరలో పట్టు సాధించిన భట్టి .. టీఆర్ఎస్ కు షాక్
ఇక ఆమన్ గల్ మున్సిపాలిటీలో కమలం వికసించింది. కాంగ్రెస్, బీజేపీ బోణీతో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం 15 వార్డుల్లో బీజేపీ 7 స్థానాల్లో స్వతంత్రులు ఒక్క స్థానంలో గెలిచారు. మిగతా స్థానాల్లోనూ బీజేపీ లీడ్ లో ఉంది. ఇక టీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. ఇక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన భైంసాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.ఆర్మూర్ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో బీజేపీ గెలుపొందింది.
మరోవైపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆరు వార్డుల్లో , వేములవాడలో 7 స్థానాల్లో , కోరుట్లలో 5 స్థానాల్లో ఇప్పటివరకు బీజేపీ విజయం సాధించింది. మరికొన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పలు వార్డుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.