Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.4,100కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్.. ఉగాదికి ముహూర్తం ఫిక్స్!

తెలంగాణా సర్కార్ మూసీ ప్రక్షాళన విషయంలో రాజీ పడేది లేదని అనేకమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రప్రభుత్వం మూసీనది పునరుజ్జీవన పనులను ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. 2026 ఉగాది పర్వదినం నాటికి ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు సంవత్సరాది రోజున ఈ పనులకు శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా మొదటి దశ మూసి ప్రక్షాళనను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి రేవంత్ శ్రద్ధ
ఈ క్రమంలోనే భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసింది. అత్యంత కీలకమైన నిధుల లభ్యత కూడా ఒక కొలిక్కి వచ్చింది. మూసీ నది పునరుజ్జీవన పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎడిబి రుణం ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేసింది. మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి, పునరుజ్జీవం నింపడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు.

musi river cleanup first phase project worth 4 100 crore has been scheduled to begin on Ugadi

ఇతర దేశాలలో అధ్యయనం
ఇప్పటికే రాష్ట్ర అధికారులను కొరియా, జపాన్ వంటి దేశాలకు పంపి అక్కడ చేపట్టిన ఇలాంటి ప్రాజెక్టులపైన అధ్యయనం చేయించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రణాళికలో కూడా మూసి పునరుజ్జీవనాన్ని చేర్చారు. నది పొడవున వాణిజ్య సముదాయాలు, వాకింగ్ ట్రాక్ లు అభివృద్ధి చేయాలని, మూసీలో నిత్యం పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చూడాలని వ్యూహరచన చేస్తున్నారు.

మొదటి దశ పనుల్లో ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మాగాంధీ విగ్రహం
అయితే ముందు మొదటి దశలో 9 కిలోమీటర్ల పరిధిలో పనులను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఈ నెలాఖరుకల్లా సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత చేపట్టాల్సిన పనులకు సంబంధించి, అధికారిక అంచనాలను కూడా రూపొందించనున్నారు. ఇక మొదటి దశలోనే లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఆయన బోధనలను తెలిపే మ్యూజియం వంటివి ఏర్పాటు చేయనున్నారు.

కేంద్రంతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు
వివిధ మతాల ప్రార్ధనా మందిరాలతో పాటు మొదటి దశలో మూసి వెంబడి రక్షణ సౌకర్యాల కోసం రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి దాదాపు 250 ఎకరాల భూమిని సేకరించవలసి ఉంది. ఈ విషయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికోసం కొన్ని ప్రైవేట్ భవనాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉన్న క్రమంలో, బాధితులకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఇక ఈ వివరాలన్నీ డీపీఆర్ లో పొందుపరచనున్నారు.

4,100కోట్ల రూపాయలతో మొదటి దశ పనులు
ఈ మొదటి దశ పనులకు దాదాపు నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రుణాన్ని ఎడిబి బ్యాంక్ నుండి తీసుకునేందుకు బ్యాంకు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదన అందిన వెంటనే బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఫిబ్రవరి చివరినాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత పనులకు టెండర్లు పిలిచే అవకాశం ఉందని అంచనా. రెండేళ్ల వ్యవధిలో ఈ మొదటి దశ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+