పావురాన్ని కాపాడేందుకు మూడు జిల్లాల్లో 10 నిమిషాల పాటు విద్యుత్ నిలిపివేత
ఒక పావురాన్ని కాపాడటానికి మూడు జిల్లాలలో పదినిమిషాల పాటు కరెంటు నిలిపివేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హైదరాబాదులోని కేపీహెచ్బీ వద్ద హైటెన్షన్ విద్యుత్ లైన్ పై ప్రమాదకరంగా ఉన్న పావురాన్ని కాపాడడం కోసం మూడు జిల్లాల్లో మెజారిటీ ప్రాంతాలలో సోమవారం పది నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

పావురం కోసం విద్యుత్ నిలిపివేసిన ట్రాన్స్ కో అధికారులు
యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ అభ్యర్థన మేరకు పావురాన్ని కాపాడడానికి రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ను నిలిపివేశారు. రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి హైదరాబాద్లోని మెజారిటీ ప్రాంతాలలో టీఎస్ ట్రాన్స్ కో అధికారులు పావురాన్ని కాపాడటం కోసం విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ వారికి విద్యుత్ షాక్ తగలకుండా పావురాన్ని రక్షించటం సాధ్యమైంది.

కరెంట్ తీగకు దారంతో చిక్కుకున్న పావురం .. రంగంలోకి యానిమల్ సొసైటీ
ఇంతకీ ఏం జరిగిందంటే ఒక పావురం గాలిలో ఎగురుతూ వెళుతున్న క్రమంలో దాని కాలికి ఉన్న దారం విద్యుత్ తీగకు చిక్కుకోవడంతో పావురం అక్కడినుండి కదలలేకపోయింది. అక్కడే అది కిందికి వేలాడుతూ కనిపించింది. ఇక ఇది గమనించిన కొందరు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ కి విషయం చేరవేశారు. దీనిని కాపాడడానికి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ బృందం రంగంలోకి దిగింది.

133 కెవి విద్యుత్ లైన్ కావటంతో ట్రాన్స్ కో అధికారులకు సంప్రదింపులు
అయితే అది 133 కెవి విద్యుత్ లైన్ అయిన కారణంగా పావురాన్ని కాపాడే క్రమంలో, కాపాడడానికి వెళ్లిన బృందం ప్రమాదంలో పడతారని గుర్తించిన సొసైటీ సభ్యులు ట్రాన్స్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్రావుతో సంప్రదింపులు జరిపారు. అయితే దీనిపై సీనియర్ అధికారుల మధ్య చర్చలు, సమావేశాల అనంతరం, పావురం కోసం మూడు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు.

విద్యుత్ నిలిపివెయ్యటంతో రెస్క్యూ చేసిన సొసైటీ
ఆ తర్వాత ఎడబ్ల్యుసిఎస్ వారు పావురాన్ని కాపాడడానికి బూమ్ లిఫ్ట్ని ఉపయోగించి పక్షిని రక్షించారు. వాస్తవంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రక్రియకు కేవలం పది నిమిషాలే పట్టినప్పటికీ, హైటెన్షన్ విద్యుత్ వైర్లు కావడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసి మొత్తం బూమ్ లిఫ్ట్ తో పావురాన్ని కాపాడడానికి ఆరు గంటల సమయం పట్టింది. ఏది ఏమైనా పావురం కోసం జరిగిన రెస్క్యూ, దానికి సహకరించిన ట్రాన్స్కో అధికారులు మూడు జిల్లాల్లో పదినిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ట్రాన్స్ కో అధికారుల చొరవతో పావురం కథ సుఖాంతం
మనుషుల కోసమే పట్టింపు లేని నేటి రోజుల్లో ఒక పావురం ప్రాణం కాపాడటం కోసం రంగంలోకి దిగిన యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ, వారికి సహకరించిన ట్రాన్స్ కో అధికార యంత్రాంగం అందరి మన్ననలు పొందుతుంది. ఒక పావురానికి ప్రాణం పోయటం కోసం చేసిన రిస్క్ కాస్త జనాలకు ఇబ్బంది కలిగించినా మొత్తానికి పావురం కథ సుఖాంతం అయ్యింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications