ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు: కేటీఆర్ పై ఘాటుగా రేవంత్ రెడ్డి
ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో, కోడ్ ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అధికార పార్టీపై నజర్ పెట్టాయి. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ కు వరుస ఫిర్యాదులు చేస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాటిని ఇవ్వకుండా అవుతుందని, రైతుబంధుని కూడా ఇవ్వద్దని చెబుతుందని టార్గెట్ చేశారు.ఇంటింటికి మంచినీళ్లు ... ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? అందులో కూడా కెసిఆర్ నే కనిపిస్తాడని కాంగ్రెస్ ను ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోమారు రుజువైందని, అన్నదాత పాలిట కాంగ్రెస్ నెంబర్ వన్ విలన్ అని ఇంకోసారి తేలిపోయిందని, పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు అంటూ పేర్కొన్నారు. రైతు బంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా అని, కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని వ్యాఖ్యలు చేశారు.
ఇక కేటీఆర్ చేసిన పోస్టుపై మండిపడిన రేవంత్ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు అంటూ కేటీఆర్ ను టార్గెట్ చేశారు. నిజంగానే నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు, నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు అని పేర్కొన్నారు.
నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు అన్న ఆయన నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదేనని స్పష్టం చేశారు. నీలాంటి వాడిని చూసే... "నిజం చెప్పులు తొడుక్కునే లోపు... అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది" అనే సామెత పుట్టిందని ఎద్దేవా చేశారు. డ్రామాలు ఆపి... నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వు... లేదంటే కాంగ్రెస్ వచ్చి...పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుంది అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ పై రివర్స్ ఎటాక్ చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications