తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్; క్యాబినెట్ హోదాతో కీలక పదవి!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాదారుడిగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో సోమేశ్ కుమార్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారని ఉత్తర్వులలో పేర్కొన్నారు .తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నియమించడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ పై జరిగిన అనేక రకాల ప్రచారాలకు తెరపడింది. ఏపీ ప్రభుత్వ సర్వీస్ నుంచి సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన గురించి పలు ఊహాగానాలు వినిపించాయి. ఆయన రెరా చైర్మన్ అవుతారని, సీఎం కేసీఆర్ సలహాదారుగా నియమితులవుతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

అంతేకాదు ఆయన బి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకొని త్వరలో ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలలో కీలక భూమిక పోషిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన పై జరిగిన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ నేడు తెలంగాణ సీఎం ప్రధాన సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకానికి సంబంధించిన విధి విధానాలు,టర్మ్స్ అండ్ కండిషన్స్ విడిగా జారీ చేయబడతాయని పేర్కొన్నారు.
1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలను నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న ఆయన,తెలంగాణ ఏర్పాటు తర్వాత అనేక శాఖలలో కీలక పదవులు నిర్వహించి, 2019 డిసెంబర్లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని ఆయన సవాల్ చేసి క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా తీర్పు ఇవ్వగా ఆపై క్యాట్ ఇచ్చిన ఆర్డర్ ను నిలిపివేయాలని కోరుతూ డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసింది.
ఇక దీనిని విచారించిన తెలంగాణ హైకోర్టు సోమేశ్ కుమార్ ను తెలంగాణ కేడర్ కు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చినఉత్తర్వులు రద్దు చేసి ఆయనను ఏపీకి వెళ్లవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణలో రిలీవ్ అయిన ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు. ఆపై కొద్దిరోజులకే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేయడంతో మళ్లీ సోమేశ్ కుమార్ తెలంగాణలో పరిపాలనలో కానీ, రాజకీయాల్లో కానీ కీలక భూమిక పోషిస్రతాని అందరూ భావించారు. అదేవిధంగా సోమేశ్ కుమార్ ను సీఎం ప్రధాన సలహాదారుడుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications