తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో సలహదారు, మైనార్టీ సంక్షేమశాఖకు ఎకె ఖాన్ ను సలహదారుడిగా నియామకం
తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమశాఖకు సలహాదారుడిగా మాజీ ఎసిబి డిజి ఎకె ఖాన్ ను నియమించింది. ఎకె ఖాన్ నియామకంతో రాష్ట్ర ప్రభుత్వానికి సలహదారుల సంఖ్య తొమ్మిదికి చేరుకొంది.
హైదరాబాద్. : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సలహదారుడిని నియమించింది. రాష్ట్ర మైనార్టీ వేల్పేర్ శాఖకు మాజీ ఎసిబి డిజి ఎకెఖాన్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎస్ పి సింగ్ నియామకంతో పాటు ఎకెఖాన్ ను సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయించింది.
ఇప్పటికే ఎనిమిది మంది సలహదారులు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నారు. ఎకె ఖాన్ నియామకంతో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సలహదారుల సంఖ్య ఎనిమిదికి చేరుకొంది.నీటిపారుదల రంగంలో సలహాదారుడిగా ఆర్ ,. విద్యాసాగర్ రావు, ప్లానింగ్ అండ్ ఎనర్జీ విభాగంలో ఎ,కె. గోయల్ , వేల్పేర్ విభాగంలో రామ లక్ష్మణ్ ను, పాలసీ, ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ లో బి.వి. పాపారావు ను, కల్చరల్, టూరిజం , దేవాదాయ విభాగంలో డాక్టర్ కెవి రమణాచారి. పైనాన్స్ కు జిఆర్ రెడ్డి, అంతరాష్ట్ర సమస్యలపై జి. వివేకానందను ప్రభుత్వం నియమించింది. వీరికితోడుగా ఆదివారం నాడు మైనార్టీ సంక్షేమ శాఖకు సలహదారుడిగా మాజీ ఎసిబి డిజి ఎకెఖాన్ ను ప్రభుత్వం నియమించింది.ఇటీవలనే రిటైరైన్ మాజీ సిఎస్ రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాన సలహాదారుడిగా నియమించుకొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నాలుగు నుండి 12 శాతం ముస్లింలకు రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించింది. ఈ మేరకు ముస్లింల జీవన స్థితిగతులపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ కూడ రిపోర్టును ఇచ్చింది..మరో వైపు తెలంగాణ ప్రభుత్వం బిసి కమీషన్ ను ఏర్పాటుచేసింది. ఎస్ టి లకు కూడ 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని టిఆర్ఎస్ హమీ ఇచ్చింది.
తమిళనాడు రాష్ట్రంలో 50 శాతం కంటే రిజర్వేషన్లను ఏ తరహలో అమలు చేస్తున్నారనే విషయమై అధ్యయనం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఎకె ఖాన్ నేతృత్వంలో అధికారుల బృందం తమిళనాడులో పర్యటించే అవకాశం ఉంది. న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాకుండా తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఏ రకంగా అమలుచేస్తున్నారనే విషయమై ఎకె ఖాన్ నేతృత్వంలోని బృందం అధ్యయనం చేయనుంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications