రైతులకు తెలంగాణా సర్కార్ అలెర్ట్.. ఆ పంటలు సాగుచేస్తే ప్రోత్సాహకాలు!

తెలంగాణ రైతులకు ముఖ్యమైన అలెర్ట్ ఇస్తుంది తెలంగాణా సర్కార్. ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను రక్షించడానికి ముందస్తు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించే విధంగా వ్యవసాయ శాఖ ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.

ఎల్ నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా ప్లాన్

ఈ పథకం ద్వారా రైతుల ఆదాయాన్ని కాపాడటంతో పాటు వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జులై-ఆగస్టు నెలల్లో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వర్షపాతం తగ్గినా పంటలు నష్టపోకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు.

Telangana Govt prepares alternate crop plan to face El Ni o threat directs promotion and incentives

ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 28 లక్షల మంది రైతులకు వాట్సాప్ ద్వారా వాతావరణ సమాచారం, సాగు సలహాలు నిరంతరం అందిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం ప్రధానంగా కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తుంది. వీటి సాగు విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా రైతులు వర్షాధారిత సాగుపై మాత్రమే ఆధారపడకుండా ఉంటారు.

పారదర్శకంగా యూరియా, ఎరువుల పంపిణీ

అంతేకాకుండా సన్న వడ్ల సాగుకు ఎనిమిది రకాల నాణ్యమైన విత్తనాలను ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు.యూరియా ఎరువుల పంపిణీలో అక్రమాలు జరగకుండా స్థానిక వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ చేస్తారు. ఎరువుల బుకింగ్ యాప్‌లో మార్పులు చేసి మీసేవ కేంద్రాల ద్వారా కూడా బుకింగ్ సౌకర్యం కల్పించనున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాన్ని అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయి.

విద్యార్థులకు భారీ శుభవార్త.. తొలిసారి కాలేజ్ స్టూడెంట్స్ కు సైతం బ్రాండెడ్ కిట్స్!
విద్యార్థులకు భారీ శుభవార్త.. తొలిసారి కాలేజ్ స్టూడెంట్స్ కు సైతం బ్రాండెడ్ కిట్స్!

రైతుల ఆదాయం పెంచేలా పంటల వైవిధ్యీకరణ

రైతుల ఆదాయం పెంచడం కోసం పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు, అపరాల సాగుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేలా ప్రణాళికలు తయారవుతున్నాయి. విత్తనాలు, ఎరువుల కొరత ఎదుర్కోకుండా బఫర్ స్టాక్ నిల్వలను ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు. ఈ చర్యలు రైతులను వాతావరణ అనిశ్చితి నుంచి రక్షించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని దీర్ఘకాలికంగా బలోపేతం చేస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+