హైదరాబాద్లో.. ఉబర్, ఓలా సేవలు బంద్!
Recommended Video

హైదరాబాద్: భాగ్యనగరంలో ఉబర్, ఓలా క్యాబ్ సేవలు సోమవారం నిలిచిపోయాయి. ఫైనాన్షియర్ల వేధింపులు, డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో సోమవారం ఉబర్, ఓలా క్యాబ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
క్యాబ్ డ్రైవర్ల కష్టాన్ని ఈ రెండు సంస్థలు దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో ప్రభుత్వం కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో క్యాబ్ల వినియోగం పెరగడంతో ఉబర్, ఓలా సంస్థలు తమ సేవలను మరింత విస్తరించాయి. కేవలం రూ.30 వేల డౌన్ పేమెంట్ చెల్లించి కారును మీ సొంతం చేసుకోవచ్చని, నెలకు రూ.70 వేలు సంపాదించొచ్చని డ్రైవర్లకు ఆశ చూపడం మొదలెట్టాయి.

దీంతో నగరంలోని కొన్ని వందల మంది డ్రైవర్లు ఉబర్, ఓలా సంస్థల్లో చేరి కారు ఓనర్లుగా మారారు. అయితే తమకు రావాల్సిన నెలసరి మొత్తాన్ని ఫైనాన్స్, మెయింటెనెన్స్ రూపంలో ఈ రెండు సంస్థలు కాజేస్తున్నాయనేది క్యాబ్ డ్రైవర్ల ఆరోపణ. నెలకు రూ.70 వేలు అని చెప్పి.. ఇప్పుడు అన్నీ పోను రూ.15 వేలు ముట్టచెబుతున్నారంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ లో క్యాబ్ బిజినెస్ చాలా బాగుందనే ప్రచారం జరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల నుంచి ఎంతోమంది డ్రైవర్లు హైదరాబాద్ వచ్చి.. సొంతంగా కార్లు కొనుకుని ఓలా, ఉబర్లో చేరారు. కానీ అనతికాలంలోనే వీళ్లలో చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వేడుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టేంతవరకు క్యాబ్ల బంద్ను కొనసాగుతుందని వారు పేర్కొంటున్నారు.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications