భర్తను చంపిన స్వాతి హత్య కేసు: ప్రియుడి తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్: తమ కొడుకు రాజేష్ను చూపించాలని అతని తల్లిదండ్రులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రాజేష్ను ఎందుకు చూపించడం లేదని వారు ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లాలో స్వాతి తన ప్రియుడు రాజేష్తో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.
చదవండి: స్వాతి ఇలా చేసిందంటే అసహ్యం వేస్తోంది, మా బావ మంచివాడు: సోదరుడు జైపాల్
చదవండి: ప్రియుడికి తెలియదు!: భర్తను చంపిన స్వాతి కేసులో ట్విస్ట్, ఏ క్షణమైనా రాజేష్ అరెస్ట్
ఈ నేపథ్యంలో స్వాతి ప్రియుడు రాజేష్ కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తన కొడుకును ఎందుకు చూపించడం లేదని రాజేష్ తల్లిదండ్రులు నిలదీసారు. ఆసుపత్రిలో ఉన్నది అసలు రాజేషా, సుధాకర్ రెడ్డా అనే విషయం తమకు తెలియాలన్నారు.
కేసులో తమ వాడు రాజేష్ను మొదటి నిందితుడిగా ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాజేష్ను అప్పగించాలని తమకు నరకం చూపించారన్నారు. తాము గత పదిహేను రోజులుగా రాజేష్ కోసం రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో వెతికామని చెప్పారు.
చదవండి: ఒంటరితనం, ప్రియుడిపై వ్యామోహం: స్వాతి భర్తను చంపడానికి కారణాలివే!