పుస్తకాలకు సినారె ఆర్థిక సహాయం
వర్ధమాన తెలుగు రచయిత్రులకు ప్రముఖ కవి, రాజ్యసభ సభ్యుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందుకుగాను ఆయన తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి పేర ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఇరవై సంవత్సరాల క్రితం సినారె సతీమణి మరణించారు. ఆయన యేటేటా ఆమె పేర ఒక తెలుగు రచయిత్రిని ఎంపిక చేసి సన్మానిస్తున్నారు.
ప్రస్తుత ట్రస్టు ద్వారా నలుగురు వర్ధమాన రచయిత్రుల రచనల అచ్చుకు ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్రతి సంవత్సరం రెండు కవితా సంపుటులకు, రెండు కథా సంపుటులకు ఈ సహాయం అందజేస్తారు. ముగ్గురు అగ్రశ్రేణి రచయిత్రులు ఈ రచనలను ఎంపిక చేస్తారు. పుస్తక రూపంలో రాని రచనలకు మాత్రమే ఈ సహాయం అందిస్తారు. మొదటగా ఈ నెల 29వ తేదీన సి. నారాయణ రెడ్డి జన్మదినం నాడు ఈ సహాయం అందిస్తారు.
సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టుకు గోవిందరాజు రామకృష్ణారావు అధ్యక్షులుగా, సినారె కూతురు సి. గంగ మేనేజింగ్ ట్రస్టీగా వుంటారు. మిగతా నలుగురు కూతుర్లు ట్రస్టు సభ్యులుగా వుంటారు. ట్రస్టు కోంస పది లక్షల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై యేటా వచ్చే లక్ష రూపాయల వడ్డీ నుండి 60 వేల రూపాయలను నలుగురు వర్ధమాన రచయిత్రులకు ఆర్థిక సహాయం అందజేస్తారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications