కేంద్ర బడ్జెట్ 2018: వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు.. అదే ప్రధాని మోడీ లక్ష్యం: అరుణ్ జైట్లీ
Recommended Video

న్యూఢిల్లీ: 75వ స్వాతంత్రం దినోత్సవం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నది ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని అరుణ్ జైట్లీ తెలిపారు. గురువారం లోక్సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడారు.
వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి కోసం రూ.2వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పటికీ రైతుల నుంచి మద్ధతు ధరకే కొనుగోలు చేస్తున్నామన్నారు.

మార్చి నాటికి 585 మార్కెట్లను ఈనామ్కు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం, పప్పు దినుసుల మద్దతు ధర ఒకటిన్నర రెట్లు పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ ఎగుమతుల్లో సరళీకరణకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
సేంద్రియ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు జైట్లీ తెలిపారు. పాడి రైతులు, ఆక్వా రైతులు సహా దేశంలోని రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. ఆహార శుద్ధి రంగానికి రూ.1,400కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆహారశుద్ధి, వాణిజ్య శాఖలతో కలిసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో క్లస్టర్ ఏర్పాటుతో మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications