కేంద్ర బడ్జెట్ 2018: వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు.. అదే ప్రధాని మోడీ లక్ష్యం: అరుణ్ జైట్లీ
Recommended Video
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్రం దినోత్సవం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నది ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని అరుణ్ జైట్లీ తెలిపారు. గురువారం లోక్సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడారు.
కేంద్ర బడ్జెట్ 2018: వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనే ఫోకస్
వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి కోసం రూ.2వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పటికీ రైతుల నుంచి మద్ధతు ధరకే కొనుగోలు చేస్తున్నామన్నారు.
మార్చి నాటికి 585 మార్కెట్లను ఈనామ్కు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం, పప్పు దినుసుల మద్దతు ధర ఒకటిన్నర రెట్లు పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ ఎగుమతుల్లో సరళీకరణకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
సేంద్రియ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు జైట్లీ తెలిపారు. పాడి రైతులు, ఆక్వా రైతులు సహా దేశంలోని రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. ఆహార శుద్ధి రంగానికి రూ.1,400కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆహారశుద్ధి, వాణిజ్య శాఖలతో కలిసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో క్లస్టర్ ఏర్పాటుతో మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.