గోదావరి పుష్కరాలు: చరిత్రలో పెను విషాదాలు ఇవీ...!
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు. దేశంలో ఇలాంటి తొక్కిసలాటలతో జరిగిన పెను విషాదాలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల 1954 నుండి 1,700 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
1954లో జరిగిన మహా కుంభమేలాకు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు వచ్చారు. అదే సమయంలో అక్కడికి ప్రముఖులు తాకిడి పెరిగింది. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 800 మంది మృతి చెందారు.
ఆ తర్వాత అతిపెద్ద మహారాష్ట్ర సతారాలో జరిగింది. వాలి వద్ద మంద్రా దేవి ఆలయం ఉంది. 2005 జనవరి 25 పౌర్ణమి రోజు అక్కడి అమ్మవారి యాత్రకు 3 లక్షల భక్తులు వచ్చారు. అమ్మవారికి సమర్పించే కొబ్బరికాయలు, పండ్లు మెట్లపై పడటంతో భక్తులు జారిపడ్డారు. అదే సమయంలో దుకాణాల్లోని సిలిండర్లు పేలాయి. దీంతో 300 మందికి పైగా మృతి చెందారు.

విషాద సంఘటనలు
1954 ఫిబ్రవరి 3 - అలహాబాద్, మహా కుంభమేళా - 800 మంది మృతి
2005 జనవరి 25 - మహారాష్ట్ర, సతారా - 300 మందికి పైగా
2008 సెప్టెంబర్ 30 - రాజస్థాన్, చాముండీ ఆలయం - 249
2008 ఆగస్టు 3 - హిమాచల్ ప్రదేశ్, నైనాదేవి - 162
2013 ఆక్టోబర్ 14 - మధ్యప్రదేశ్, నవరాత్రి ఉత్సవాలు - 115
2011 జనవరి 14 - శబరిమల - 106
2010 మార్చి 4 - ఉత్తర ప్రదేశ్, రాంజానకీ ఆలయం - 63
1992 ఫిబ్రవరి 18 - తమిళనాడు, కుంభకోణం - 60
1996 జూలై 15 - మధ్యప్రదేశ్, ఉజ్జయిని - 60
199 జనవరి 14 - శబరిమల - 53
1986 ఏప్రిల్ 14 - హరిద్వార్ - 46
1981 డిసెంబర్ 4 - కుతుబ్ మినార్ - 41
2003 ఆగస్టు 27 - నాసిక్ కుంభమేళా - 29
2013 ఫిబ్రవరి 12 - అలహాబాద్, మహా కుంభమేళా - 37
1996 సెప్టెంబర్ 18 - కోల్కతా - 35
2014 అక్టోబర్ 3 - పాట్నా 33
1986 నవంబర్ 9 - అయోధ్య - 32
2015 జూలై 14 - రాజమండ్రి, ఏపీ, గోదావరి పుష్కరాలు - 27

2014 ముంబైలో 18, ఆగస్టులో భోపాల్లో 18 మంది, 2011లో హరిద్వార్లో 16, 2007లో గుజరాత్ మహంకాళీ ఆలయంలో 12 మంది చనిపోయారు.ఆగస్టు 27, 2004లో కృష్ణా పుష్కరాల సమయంలో ఐదుగురు మృతి చెందారు.
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications