'జగన్తో స్నేహం సరే, అటు వైపు వద్దని చెప్పా'

వైయస్ జగన్తో తన కుమారుడి స్నేహం గురించి ఆయన గురువారం నోరు విప్పారు. అసెంబ్లీ లాబీలో ఆయన ఆ విషయం గురించి మాట్లాడారు. రాజకీయం, స్నేహం రెండూ వేర్వేరుగా ఉండాలని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. ఆ రెండింటిని కలిపి రాజకీయం చేయరాదని ఆయన హితవు పలికారు. ఇది తన రాజకీయ జీవిత చరమాంకంలో నేర్చుకున్న పాఠమని అన్నారు.
అదే విషయాన్ని తాను తన కుమారునికి కూడా బోధించానని చెప్పారు. కాంగ్రెస్తో తమ కుంటుంబం అనుబంధం వందేళ్లకు పైనే అని తెలిపానని చెప్పారు. స్నేహం పేరిట ఆ అనుబంధాన్ని తెంచుకోవద్దని సూచించానని, దానిని తన కుమారుడు పాటిస్తున్నాడని చెప్పారు. తన కుమారుడు స్నేహం కోసం కాంగ్రెస్ను వీడటం అనేది జరగదని మంత్రి స్పష్టం చేశారు.
తన కుమారుడు తన మాట విన్నాడని కాసు వెంకటకృష్ణా రెడ్డి చెప్పారు. మిగతా కాంగ్రెసు నాయకులు, మంత్రులు ఆ విషయాన్ని అలా చెప్పగలరా అనేది అనుమానమే.
-
జగన్ కు 'మావిగన్' సలహా ఆయనదే, అసలు టార్గెట్..!! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications