వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్‌తో స్నేహం సరే, అటు వైపు వద్దని చెప్పా'

By Pratap
|
Google Oneindia TeluguNews

Kasu Venkata Krishna Reddy
హైదరాబాద్: చాలా మంది మంత్రులు సంతానం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. ఇది మంత్రులకు, సీనియర్ కాంగ్రెసు నాయకులకు తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల్లో తమ సంతానమే తమకు పోటీకి మారుతుందా, తామే అటు వైపు వెళ్లాల్సి వస్తుందా అనేది వారికి అంతుపట్టకుండా ఉంది. మరోవైవు, వారే తమ సంతానాన్ని జగన్ వైపు పంపిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డికి కూడా ఈ బెడద తప్పడం లేదు.

వైయస్ జగన్‌తో తన కుమారుడి స్నేహం గురించి ఆయన గురువారం నోరు విప్పారు. అసెంబ్లీ లాబీలో ఆయన ఆ విషయం గురించి మాట్లాడారు. రాజకీయం, స్నేహం రెండూ వేర్వేరుగా ఉండాలని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. ఆ రెండింటిని కలిపి రాజకీయం చేయరాదని ఆయన హితవు పలికారు. ఇది తన రాజకీయ జీవిత చరమాంకంలో నేర్చుకున్న పాఠమని అన్నారు.

అదే విషయాన్ని తాను తన కుమారునికి కూడా బోధించానని చెప్పారు. కాంగ్రెస్‌తో తమ కుంటుంబం అనుబంధం వందేళ్లకు పైనే అని తెలిపానని చెప్పారు. స్నేహం పేరిట ఆ అనుబంధాన్ని తెంచుకోవద్దని సూచించానని, దానిని తన కుమారుడు పాటిస్తున్నాడని చెప్పారు. తన కుమారుడు స్నేహం కోసం కాంగ్రెస్‌ను వీడటం అనేది జరగదని మంత్రి స్పష్టం చేశారు.

తన కుమారుడు తన మాట విన్నాడని కాసు వెంకటకృష్ణా రెడ్డి చెప్పారు. మిగతా కాంగ్రెసు నాయకులు, మంత్రులు ఆ విషయాన్ని అలా చెప్పగలరా అనేది అనుమానమే.

English summary

 Minister Kasu Venkata Krishna Reddy has advised his son not to mix friendship with politics. He said that his has yeilded to his advise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X